కొల్లాపూర్ రూరల్, మే 23 : ప్రశాంతంగా ఉన్న కొల్లాపూర్ వరుస హత్యలతో ఉలిక్కిపడుతున్నది. బీఆర్ఎస్ నాయకులను లక్ష్యంగా చేసుకొని రాజకీయ ప్రేరేపిత హత్యలు, దాడులతో స్థానిక మంత్రి కొల్లాపూర్ను రావణ కాష్టంలా మార్చారు. 2003 డిసెంబర్ 29 నుంచి ఈ ఏడాది మే 23 వరకు కొల్లాపూర్ నియోజకవర్గంలో జరుగుతున్న వరుస ఘటనలను చూసి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.
కొల్లాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుజ్జుల పరమేశ్ను లక్ష్యంగా చేసుకొని పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామంలో 2023 నవంబర్ 29న అసెంబ్లీ ఎన్నికలకు ముం దు రోజు రాత్రి పక్కా ప్రణాళికతో మంత్రి అనుచరులు గుజ్జల పరమేశ్పై హత్యాయత్నానికి పాల్పడ్డారు.
పెద్దకొత్తపల్లి మండలం జొన్నలబొగుడ సర్పంచ్ ఇందిర, బీఆర్ఎస్ నాయకుడు రవినాయక్ వాళ్ల అమ్మపై డిసెంబర్ 4న ఎమ్మెల్యే ఫలితాల తర్వాత కాంగ్రెస్ నాయకులు దాడులకు తె గపడ్డారు. అంతేకాదు రాజీ కోసం పిలుచుకొని రవి నాయక్పై దాడిచేసి తన కారును ధ్వంసం చేయడంతోపాటు అక్రమ కేసులను బనాయించి రిమాండ్కు పంపించారు. ఎంపీ ఎన్నికల పొలింగ్ రోజున బీఆర్ఎస్ కార్యకర్త గుడెసెను తగులబెట్టారు.
నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే ఎన్నికల కౌం టింగ్ కేంద్రం వద్ద బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రంగినేని అభిలాష్రావు కారుపై బీరుబాటిళ్లు, ఇనుప రాడ్లతో దాడి చేసి కారులో ఉన్న అభిలాష్రావుపై కొల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు హత్యాయత్నం చేశారు.
పాన్గల్ ఎంపీపీ శ్రీధర్రెడ్డి ఇంట్లోకి జనవరి 25న రాత్రి కాంగ్రెస్ నాయకులు అక్రమంగా చొరబడి కిరోసిన్ పోసి హ త్య చేసేందుకు ప్రయత్నం చేశారు.
చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన శ్రీధర్రెడ్డి హత్యతో ప్రశాంతంగా ఉన్న కొల్లాపూర్ను దాడుల సం స్కృతికి కేరాఫ్గా మార్చారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.