వనపర్తి, డిసెంబర్ 22 (నమస్తే తె లంగాణ) : వ్యవసాయ ఆధారిత కు టుంబాలు సాగు చేసే ప్రతి చేనుకు నీరు అందిస్తే.. అందరి చేతికి పని దొరుకుతుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు. సాగునీరు పుష్కలంగా ఉంటేనే వ్యవసాయ అనుబంధ రంగాలకు సైతం ఉపాధి దొ రుకుతుందని చెప్పారు. వనపర్తి జిల్లా మెట్పల్లి నందిమల్ల గడ్డకు రూ.92 లక్షలతో.. 300 ఎకరాలకు సాగునీరు అం దించేందుకు 5 కి.మీ. మేర పైపులైన్ పూ ర్తి చేసి మినీ ఎత్తిపోతల పథకాన్ని స్థానిక నాయకులతో కలిసి మంత్రి లాంఛనం గా ప్రారంభించారు.
ఈ సందర్భంగా నందిమల్ల గడ్డ ప్రజలతో కలిసి అల్పాహారం చేశారు. అనంతరం మాట్లాడు తూ సాగునీటి రాకతో పల్లెలన్నీ సస్యశ్యామలం అయ్యాయని తెలిపారు. ఈ ఒ క్క సీజన్లో రూ.కోటీ 20 లక్షల వేరుశనగ దిగుబడిని రైతులు సాధించారన్నా రు. గత ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణితో న ష్టపోయిన రైతులు తెలంగాణలో ఆర్థికం గా నిలదొక్కుకుంటున్నారని చెప్పారు. వనపర్తి పట్టణానికి సమీపాన ఉన్న వ్యవసాయ భూములకు సాగునీటి రాకతో కూరగాయలు, వేరుశనగ సాగు చేస్తున్నారన్నారు. 2014లో 68 లక్షల మెట్రి క్ టన్నులు ఉన్న ధాన్యం ఉత్పత్తి ఎనిమిదేండ్లలో 2.5 కోట్ల మెట్రిక్ టన్నుల కు చేరిందన్నారు.
ఎనిమిదేండ్లలో సీఎం కేసీఆర్ వ్యవసాయ అనుకూల విధానాలతో ఇది సాధ్యమైందని తెలిపారు. వా నకాలం, యాసంగి పంటలతో రైతులు, రైతు కూలీలకు చేతినిండా పని దొరుకుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలోనే ఎక్క డా లేని విధంగా వనపర్తి నియోజకవర్గంలో 64 మినీ ఎత్తిపోతల పథకాలతో సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తున్నామని చెప్పారు. పొట్టచేత పట్టుకుని వలసపోయిన పరిస్థితి నుంచి తిరిగి వలసలు వచ్చే పరిస్థితి కండ్ల ముందు కనిపిస్తున్నదని వివరించారు. పల్లెలు పచ్చబడితేనే ప్రగతి సా ధ్యమని తెలంగాణ ప్రభుత్వం రైతు సం క్షేమానికి పెద్దపీట వేసిందన్నారు. రైతుబంధు, రైతుబీమా, నిరంతర విద్యుత్, సాగునీటి సదుపాయం మూలంగా వ్య వసాయం లాభసాటిగా మారిందన్నా రు.
దీంతో రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరిగి సాగు సంబురంగా సాగుతున్నదని చె ప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ తెలంగాణ తరహా పథకాలు అమలు కావడం లేదన్నారు. 60 శాతం మంది ఆధారపడ్డ వ్యవసాయరంగానికి చేయూతనివ్వడం పాలకుల బాధ్యత అని ఆయనన్నారు. అందుకే సీఎం కేసీఆర్ రైతును రాజు చేయాలనే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా కర్షకులను చైతన్యం చేసి బీజేపీ పాలనను ఎండగడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, నాయకులు పాల్గొన్నారు.