మిడ్జిల్, డిసెంబర్ 11 : ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ జోరుగా సాగుతున్నది. ప్రభుత్వ మద్దతు ధరకు రైతులు ధాన్యం విక్రయించి లబ్ధి పొందుతున్నారు. గతంలో ధాన్యం విక్రయించేందుకు రైతు లు అనేక ఇబ్బందులు పడేవారు. ఆరుగాలం కష్టించి పంట ను పండించడం ఒకవంతయితే…ధాన్యం విక్రయించడం మరోవంతుగా ఉండేది. సమీపంలోని మార్కెట్లకు తరలించేందుకు వ్యయప్రయాసలకు గురయ్యేవారు. రైతుల ఇబ్బందులను ఆసరాగా చేసుకొని దళారులు ధాన్యానికి సరైన ధర ఇవ్వకపోవడంతోపాటు, తూకంలో అక్రమాలకు పాల్పడు తూ మోసం చేసేవారు. ధాన్యం విక్రయించిన తర్వాత డబ్బు ల కోసం రోజుల తరబడి వ్యాపారుల చుట్టూ తిరిగేవారు.
రైతుల ఇబ్బందులను తీర్చేందుకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకు శ్రీకారం చుట్టింది. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేసి అండగా నిలించింది. పీఏసీసీఎస్, ఐకేపీ ఆధ్వర్యంలో అన్ని గ్రామా ల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధరకు ధాన్యం కొంటుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ధాన్యానికి మద్దతు ధర కల్పించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మిడ్జిల్ మండలంలో పీఏసీసీఎస్ ఆధ్వర్యంలో ఏడు, ఐకేపీ ఆధ్వర్యంలో ఆరు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు.
పీఏసీసీఎస్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు 804మంది రైతుల నుంచి సుమారు 50,714క్వింటాళ్ల ధాన్యం సేకరించారు. ఐకేపీ ఆధ్వర్యంలో 297మంది రైతుల నుంచి సుమారు 13,853 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు. మండలవ్యాప్తంగా మొత్తం 64,597 క్వింటా ళ్ల ధాన్యం సేకరించారు. ధాన్యం విక్రయించిన రైతుల బ్యాంకు నిర్ణీత గడువులోగా డబ్బులను జమ చేస్తున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలతో రైతులకు దళారుల బెడద తప్పింది. గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు చేయడంపై రైతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో ధాన్యం కొనుగోలు కేంద్రా లు లేకపోవడంతో దళారులను ఆశ్రయించేవాళ్లం. వారు తూకంలో మోసాలు చేయడం, గిట్టుబాటు ధర ఇవ్వకపోవడంతోపాటు డబ్బులను ఇవ్వడానికి నెలల తరబడి తిప్పకునేవారు. నేడు గ్రామ రైతులకు అందుబాటులో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడంతో ఎంతో మేలు చేకూరింది. రెండు ఎకరాల్లో వరిపంట సాగు చేయగా 50 క్వింటాల వడ్లను కేంద్రంలో విక్రయించాను. సకాలంలో బ్యాంకు ఖాతాలో డబ్బులను జమ చేశారు.
– జగన్గౌడ్, మిడ్జిల్
రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరకు ధా న్యం కొనుగోలు చే యడం హర్షణీయం. ఇది రైతులకు భరోసా ఇవ్వడమే. వ్వయప్రయాసలకు ఓర్చి పం ట పండించే రైతుకు దళారుల బెడద తప్పింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర లభిస్తున్నది.
– దానియేలు, బీఆర్ఎస్ కార్మిక విభాగం
మండల అధ్యక్షుడు
పీఏసీసీఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలుకు రైతుల నుంచి మంచి స్పందన ఉంది. మండలంలో 7 కేం ద్రాలను ఏర్పాటు చేశాం. ఇప్పటి వరకు 804మంది రైతుల నుంచి దా దాపు 50,714 క్వింటాళ్ల ధాన్యం కొ నుగోలు చేశాం. మంచి ధర లభిం చడంతోపాటు రైతుల బ్యాంక్ ఖాతా లో డబ్బులు జమ అవుతున్నాయి. రైతులు దళారులను ఆశ్రయించకుండా ధాన్యాన్ని నేరుగా కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలి.
– శ్రీనివాస్రెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్