మహబూబ్నగర్, మార్చి 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఉమ్మడి జిల్లాలో మరో సంగ్రామానికి సమయం ఆసన్నమైంది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ ఎన్నిక కోసం కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది. ఈ మేరకు 4న ఎన్నికల నోటిఫికేషన్ను కలెక్టర్ విడుదల చేయనుండగా, 11 వరకు నామినేషన్ల స్వీకరణ, 28వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు. 2021 నవంబర్లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కశిరెడ్డి నారాయణరెడ్డి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యా రు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పా ర్టీలో చేరి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఎన్నిక అనివార్యమైంది. ప్రస్తు తం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 1,445 మంది ఓటర్లు ఉన్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, ఎక్స్ అఫీషియల్ కలి సి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి రెవె న్యూ డివిజన్కు ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహిస్తారు. మహబూబూబ్గర్ కలెక్టర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నోటిఫికేషన్ విడుదలకు సమయం దగ్గర పడడంతో అన్ని రాజకీయ పక్షాలు అస్ర్తాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రస్తుతం బీఆర్ఎస్లోనే స్థానిక ప్రజాప్రతినిధులు కొనసాగుతున్నారు. కొన్నిచోట్ల పార్టీ మారినప్పటికీ మెజార్టీ స్థానంలో బీఆర్ఎస్కే మద్దతు పలుకుతున్నారు. కాగా, అధికార కాంగ్రెస్ పార్టీ స్థానిక ప్రజాప్రతినిధులను తమ వైపునకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నది. దీనిని తిప్పికొట్టడానికి బీఆర్ఎస్ సిద్ధమవుతున్నది.
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ ఎన్నిక ఉ మ్మడి జిల్లాలో ఉత్కంఠ రేపుతున్నది. అసెంబ్లీ ఎన్నికల వరకు బీఆర్ఎస్కు తిరుగులేని విజయం అందించడం తో రెండు స్థానాల్లో కశిరెడ్డి నారాయణరెడ్డి, కూచకుళ్ల దామోదర్రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ ఎ న్నికల్లో టికెట్లు కేటాయించకపోవడంతో వీరిద్దరూ కాంగ్రెస్ గూటికి చేరారు. ఇందులో కశిరెడ్డి నారాయణరెడ్డి పదవీకాలం 2028 వరకు ఉండగా, ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశా రు. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ఎన్నికల షెడ్యూల్ ఖరారు చేసింది. మార్చి 4న ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. 11న నామినేషన్ల స్వీకరణ, 12న పరిశీలన, 14వరకు ఉపసంహరణకు గడువు, 28న ఎన్నికలు నిర్వహిస్తారు. 2021 ఎన్నికల్లో గెలుపొందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఓటు హక్కు ఉంటుంది. ప్రస్తుతం ఉమ్మ డి మహబూబ్నగర్ జిల్లాలో 1,445 మంది ఓటర్లు ఉండగా, ఇందులో 644 మంది పురుషులు, 801 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 896 మంది ఎంపీటీసీలు, 451 మంది కౌన్సిలర్లు, 82 మంది జెడ్పీటీసీ లు, 16 మంది ఎక్స్ అఫీషియల్ సభ్యులు ఓటర్లుగా ఉన్నారు. ప్రతి రెవెన్యూ డివిజన్కు ఒక పోలింగ్ కేం ద్రాన్ని ఏర్పాటు చేసి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ ఎన్నికలో ఆయా పార్టీల నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు ప్రయత్నాలు ప్రారంభించారు. కాంగ్రె స్, బీఆర్ఎస్ మధ్య ప్రధాన పోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్ర స్తుతం కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్కే ఎక్కువ మంది స్థానిక ప్రజాప్రతినిధుల మద్దతు ఉన్న ది. బీజేపీకి స్థానిక సంస్థల్లో తగినంతబలం లేకపోవడంతో ఆ పార్టీ ఎన్నికలకు దూరంగా ఉండబోతున్నదని ప్రకటించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటికీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ స్థానం మళ్లీ కారుదేనని విశ్లేషకులు అంటున్నారు. దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు ఉ న్నాయి. ఆల అభ్యర్థిత్వాన్ని పార్టీ నేతలు దాదాపుగా ఖరారు చేశారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల నుంచి కూడా కొంతమంది టికెట్ ఆశిస్తున్నప్పటికీ మాజీ ఎమ్మెల్యేకే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ ఓట్లతో ఓటమి చవిచూసి ప్రజల్లో సానుభూతి తెచ్చుకున్నా రు. సీఎం సొంత జి ల్లా అయినప్పటికీ ఆల వెంకటేశ్వర్రెడ్డిని రంగంలో దించితే ఎమ్మెల్సీ ఎ న్నికల్లో గెలుపు అవకాశాలు మెండుగా ఉంటాయని గులాబీ పార్టీ భావిస్తున్నది. ఇందుకు మాజీ మం త్రులు రంగంలోకి దిగి స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఇక కాం గ్రెస్ పా ర్టీ పారిశ్రామికవేత్తకు టికెట్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తున్నది. ప్రస్తుతం జడ్చర్ల, అలంపూర్, గద్వాల, మహబూబ్నగర్, నారాయణపేట. నాగర్కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్, అచ్చంపేట. షాద్నగర్ నియోజకవర్గం మెజార్టీ ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్కే మద్దతుగా నిలిచారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్న తరుణంలో ఎమ్మెల్సీ ఎన్నిక బీఆర్ఎస్కు కలిసి వచ్చే అంశం.