సార్వత్రిక ఎన్నికల సమరంలో గులాబీ పార్టీ దూకుడు పెంచింది. ఉమ్మడి జిల్లాలోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్ పార్లమెంట్ సె గ్మెంట్ల నుంచి బీఆర్ఎస్ తరఫున రేసులో ఉన్న అభ్యర్థులు మన్నె శ్రీనివాస్రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు పార్టీ అధినేత కేసీఆర్ గురువారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఫాంలు అందించారు. అనంతరం రెండు పార్లమెంట్ స్థానాలను బీఆర్ఎస్ గెలిచి తీరాలని గులాబీ బాస్ ఆదేశించారు.
వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రెండు పార్లమెంట్ పరిధిలో నియోజకవర్గాల వారీగా ఇన్చార్జిలను నియమించారు. మాజీ మంత్రులు శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డి ఆధ్వర్యంలో మండలాల వారీగా సన్నాహక సమావేశాలను నిర్వహిస్తున్నారు. గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యేలతోపాటు మాజీ ఎమ్మెల్యేలు సమన్వయ సమావేశాలను విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ప్రచా ర పర్వాన్ని ప్రారంభించారు. గ్రామాల వారీగా కమిటీలు వేసి పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్లను కలిసేందుకు బీఆర్ఎస్ పక్కా స్కెచ్ వేసింది.