ఉమ్మడి జిల్లాలో నీలి విప్లవం కొనసాగుతున్నది. ముదిరాజ్ కుటుం బాలకు ప్రభుత్వం చేయూతనిస్తున్నది. ఇందుకోసం ప్రభుత్వం ఏటా రూ.కోట్లు ఖర్చు చేస్తున్నది. ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేస్తూ వీటిని రిజర్వాయర్లు, చెరువుల్లో విడుదల చేయగా.. నేడు పెరిగి పెద్దయ్యాయి. దీంతో ఎక్కడ చూసినా మత్స్యసంబురం నెలకొ న్నది. ఏ గ్రామంలో చూసినా చేపల పండుగనే కొనసాగుతున్నది. సోమవారం వనపర్తి జిల్లా కడుకుంట్ల గ్రామ శివారులోని రామసము ద్రంలో మత్స్యకారులు చేపల వేట కొనసాగించారు. రౌట, బంగారు తీగ, బొచ్చరకం, కొర్రమట్ట రకంలో ఒక్కో చేప 5 నుంచి 7 కిలోల బరువు పెరిగాయి. దాదాపు 5 టన్నుల కుపైగా చేపలను పట్టి హైదరాబాద్కు విక్రయించడానికి తరలించారు. మత్స్య సిరులతో ముదిరాజ్ల ఆనందానికి
అవధుల్లేకుండా పోయాయి.
– నెట్వర్క్ మహబూబ్నగర్, నమస్తే తెలంగాణ
ఉమ్మడి పాలమూరు జిల్లాలో మత్స్య సంబురం నెలకొన్నది. ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తుండడంతో మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు విరజిమ్ముతున్నాయి. సీఎం కేసీఆర్ హయాంలో సాగునీరు పుష్కలంగా కావడంతో ఏ చెరువు, రిజర్వాయర్ చూసినా నీటితో జలకళను సంతరించుకున్నాయి. నిండు వేసవిలోనూ కళకళలాడాయి. దీంతో ప్రభుత్వం అందించిన చేప పిల్లలను వీటిలో విడిచిపెట్టగా నేడు అవి పెరిగి పెద్దయ్యాయి. నేడు చేపలను పడుతూ ముదిరాజ్లు ఆర్థికంగా బలోపేతమవుతున్నారు.
వనపర్తి జిల్లా కడుకుంట్ల గ్రామ శివారులోని రామసముద్రంలో మత్స్యకారులు సోమవారం సామూహికంగా చేపల వేట కొనసాగించారు. దాదాపు 5 టన్నుల వరకు చేపలు పట్టారు. ఒక్కో చేప 5 నుంచి 7 కిలోల వరకు పెరిగాయి. వీటిలో రౌట, బంగారు తీగ, బొచ్చరకం, కొర్రమట్ట రకం లభ్యమయ్యాయి. చేపలను చూసిన మత్స్యకారులు సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. వీటిని సాయంత్రం హైదరాబాద్లో విక్రయించేందుకు మత్స్యకారులు తరలించారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ముదిరాజ్లు ఆర్థికంగా బలోపేతమవుతున్నారు. చేపలను విక్రయించి వృద్ధిలోకి వస్తున్నారు. ఇందుకు సహకారం అందించిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని చెబుతున్నారు.