కాడెద్దులు నిత్య శ్రమ జీవులైన రైతు కుటుంబాలకు శుభసూచికమని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అభిప్రాయపడ్డారు.
ఎవుసానికి, ఎడ్లకు అవినాభావ సంబంధం
పశుజాతిని సాగు, పాడి, పెంటకు ప్రోత్సహించాలి
వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి
పెబ్బేరు, జనవరి 20 : కాడెద్దులు నిత్య శ్రమ జీవులైన రైతు కుటుంబాలకు శుభసూచికమని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అభిప్రాయపడ్డారు. శుక్రవారం పట్టణలోని ఒకటో వార్డులో కంటి వెలుగు శిబిరాన్ని జిల్లా అదనపు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్తో కలిసి మంత్రి సందర్శించారు. చౌడేశ్వరీ దేవి బ్రహ్మోత్సవాల సందర్భంగా రైతు కమిటీ ఆధ్వర్యం లో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి బండలాగుడు, క్రికెట్ పోటీలను మంత్రి ప్రాంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ త్వ రహిత తెలంగాణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. వృషభాలు లేకుంటే వ్యవసాయమే లేద ని, వ్యవసాయం లేకుంటే మానవ మనుగడే ఉండదన్నారు.ప్రతి రైతు కచ్చితంగా కాడెద్దులను పోషించాలని సూచించారు. పశుజాతిని పాడి కోసం, పెండ, వ్యవసాయంకోసం ప్రోత్సహించాలని వివరించారు. వ్యవసాయ భూములను సారవంతం చేసేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు.
వ్యవసాయదారుల ను ప్రోత్సహించాలని, రైతులను గౌరవించాలన్నారు. రైతు ఉత్పత్తి ఖర్చులను తగ్గించి నాణ్యమైన, స్థిరమైన పంటల ఉత్పత్తితో అధిక లాభాలను పొందడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. ఎడ్ల బండ్ల పోటీలు, బండలాగుడు పోటీలను ఆదరించాలని సూచించారు. అనంతరం పట్టణ శివారులో నాలుగు ఎకరాల్లో బంగినపల్లి నీలంరసాల మామిడి రకాన్ని సాగు చేసి 25 టన్నుల వరకు దిగబడి సాధించిన రైతులు సిద్ధేశ్వర్రెడ్డి, బ్రహ్మానందరెడ్డిని మంత్రి అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కరుణశ్రీ, వైస్చైర్మన్ కర్రెస్వామి, కౌన్సిలర్లు రా మకృష్ణ, ఎల్లారెడ్డి, సుమతి, పద్మ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బుచ్చారెడ్డి, రాములు, దిలీప్రెడ్డి, సాయినాథ్ పాల్గొన్నారు.
అడగకుండానే పనిచేసే నేత కేసీఆర్
పెద్దమందడి, జనవరి 20 : ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అడగకుండానే పనిచేసే నేత సీఎం కేసీఆర్ అని మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. మండలంలోని వెల్టూర్లో నిర్వహించిన కంటివెలుగు కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదలకు కంటి సమస్యను దూరం చేసేందుకు సీఎం కేసీఆర్ కంటివెలుగు కార్యక్రమం చేపట్టారని తెలిపారు. ఆరోగ్య తెలంగాణగా మార్చడమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. వనపర్తి ని యోజకవర్గంలో ఏర్పాటు చేసిన 61 సబ్సెంటర్లల్లో ఎంబీబీఎస్ డాక్టర్లు అందుబాటులో ఉండి సేవలు అందిస్తారన్నారు. కార్యక్రమం లో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్రెడ్డి, డాక్టర్లు సాయినాథ్రెడ్డి, కృష్ణ య్య, మంజుల, జెడ్పీటీసీ రఘుపతిరెడ్డి, సర్పంచ్ శ్రీ నివాస్రెడ్డి, గొర్రెలకాపరుల జిల్లా అధ్యక్షుడు కురుమూర్తియాదవ్, ఎంపీటీసీ అంజనమ్మ, వైస్ఎంపీపీ రవిప్రసాద్, ఉన్ని సొసైటీ అధ్యక్షుడు వెంకటయ్య మార్కెట్ కమిటీ డైరెక్టర్ శివశంకర్, మాజీ ఎంపీపీ దయాకర్, మా జీ జెడ్పీటీసీ వెంకటస్వామి పాల్గొన్నారు.
పల్లెల్లో ‘ప్రగతి’ కళ
వనపర్తి, జనవరి 20 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతితో గ్రామాల రూ పురేఖలే మారిపోయాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. శుక్రవారం రాత్రి వనపర్తి మండలం చిమనగుంటపల్లి గ్రామంలో మంత్రి పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. మంత్రికి గ్రామస్తులు ఘన స్వాగతం పలకగా.. గ్రామంలో పర్యటించారు. అనంతరం మాట్లాడుతూ సీఎం కేసీఆర్ హ యాంలో వ్యవసాయం, సాగునీటి రంగానికి పెద్దపీట వేశామన్నారు. దీంతో నాడు బీళ్లుగా ఉన్న భూములు నేడు పచ్చని పొలాలతో మాగాణుల్లా మారాయని తెలిపారు.
గ్రామా ల్లో ఎక్కడ చూసినా కనుచూపు మేరలో పంట లే కనిపిస్తున్నాయని చెప్పారు. వనపర్తి జిల్లా లో 65 మినీ లిఫ్ట్లను ఏర్పాటు చేసి సాగునీటిని అందిస్తున్నామన్నారు. వ్యవసాయం బా గుంటేనే అనుబంధ రంగాలకు చేతినిండా పని దొరుకుతుందని వివరించారు. సొంత జాగా ఉంటే ఇల్లు కట్టుకునేందుకు రూ.3 లక్షలు అందించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నదని తెలిపారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.