మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఏప్రిల్ 12: ప్రజల ఆరోగ్య సంరక్షణే ప్రభుత్వ లక్ష్యమని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వారిని ఉపేక్షించబోమని, కల్తీ మద్యంపై ఉక్కుపాదం మోపుతామన్నారు. మహబూబ్నగర్ ప్రభుత్వ దవాఖానలో కల్తీ కల్లుతో ఇ ద్దరు చనిపోయారని మీడియాలో వార్తలు రాగా.. బుధవారం ఆయన సూపరింటెండెంట్ చాంబర్లో మీడియాతో సమావేశమయ్యారు. అంతకుముందు ఆయా వార్డుల్లో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు.
అనంతరం మాట్లాడుతూ ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు ఆధారంగా మృతికి గల కారణాలు తెలుస్తాయని.. మంత్రి వివరించారు. కల్తీ కల్లు వల్ల చనిపోయారని తెలిస్తే అందుకు కారణమైన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతోపాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చనిపోయిన ఇ ద్దరిలో ఒకరు ప్రమాదానికి గురయ్యారని, లివర్ పాడైపోవడంతోపాటు ఇతర కారణాల వల్ల చనిపోయారన్నారు. ఇంకొకరు అనాథ అని.. అతడికి తరుచూ ఫిట్స్ వచ్చేవన్నారు. శరీరంలో చాలా అ వయావాలు దెబ్బతిన్నందువల్ల చనిపోయాడని తె లిపారు.
ఇందుకు సంబంధించి ఎఫ్ఐఆర్తో పా టు, వారి బంధువుల రిపోర్టు కూడా ఉందని తెలిపారు. ప్రభుత్వం నిక్కచ్చిగా పనిచేస్తోందని, ప్రజ ల ఆరోగ్యంతో ఎవరైనా చెలగాటమాడితే సహించమని స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణే తమ ధ్యేయమన్నారు. మహబూబ్నగర్ ప్రభుత్వ దవాఖానలో ఎంతో మార్పు వచ్చిందని.. వైద్య సదుపాయాలు మెరుగుపడ్డాయన్నారు. రూ.500 కోట్లతో పాత కలెక్టరేట్ స్థానంలో సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మిస్తున్నామని మంత్రి వెల్లడించారు.
ఆయా టీవీలలో వచ్చిన కథనాలపై దవాఖాన సూపరింటెండెంట్, ఎక్సైజ్ సూపరింటెండెంట్తో విచారణ చేయిస్తామని.. కల్తీ కల్లు వల్ల చనిపోయినట్లు ఆధారాలు ఉంటే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో కల్తీ కల్లు వల్ల చనిపోతే మంత్రి స్పందించడం లేదన్నది అబద్ధమని, రిపోర్టులు వచ్చిన తర్వాత పకడ్బందీ చర్యలు చేపడతామన్నారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు రాగానే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటి వరకు 64 శాంపిళ్లను పరీక్షలకు పంపామని.. ఏ శాంపిళ్లో అయినా కల్తీ వల్ల అని తేలితే చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో దవాఖాన సూపరింటెండెంట్ రాంకిషన్, వైద్యు డు జీవన్, ముడా చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.