నర్వ, ఫిబ్రవరి 4 : సర్కార్ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే ప్రభు త్వ లక్ష్యమని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. మండలంలోని రాయికోడ్ పాఠశాలలో మన ఊరు – మ న బడి కార్యక్రమానికి శనివారం ఎమ్మెల్యే హాజరయ్యారు. పాఠశాల ఆవరణలో నిర్మించిన అదనపు గదులు, అధునీకరించిన గదులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెరుగైన విద్యను అందించడంలో సమకూర్చుకోవాల్సిన మౌలి క సదుపాయాలకు పాఠశాలలో చేపట్టవలసిన అదనపు పనులకు అవసరమైనన్ని నిధులు సమకూర్చుతానని పే ర్కొన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థు లు వందశాతం హాజరయ్యేలా చూ స్తూ, సృజనాత్మకమైన ప్రతిభను వెలికితీసి జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకునేలా తీర్చిదిద్దాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ జయరాములుశెట్టి, సర్పంచ్ సుశీలమ్మ, డీపీవో ము రళి, ఎంఈవో లక్ష్మీనారాయణ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహేశ్వర్రెడ్డి, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
మక్తల్ టౌన్, ఫిబ్రవరి 4 : మున్సిపల్లో చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను పూర్తి నాణ్యతతో చేపట్టాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. టీయూఎఫ్ఐడీసీ రూ.5కోట్ల నిధులతో మక్తల్లో చేపడుతున్న నిర్మాణ పనులు పూర్తిస్థాయిలో నాణ్యతతో చేపట్టాలని కాం ట్రాక్టర్ను ఆదేశించారు. సీసీ రోడ్ల నిర్మాణంతోపాటు డ్రైనేజీలను సైతం నాణ్యతగా నిర్మించాలన్నారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులను ప్రారంభించి మక్తల్ ము న్సిపాలిటీని జిల్లాలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాడానికి చర్యలు చేపట్టామన్నారు. అందరూ కలిసి కట్టుగా ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యపడుతుందని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో ఏఈ నాగశివ, కౌన్సిలర్ శ్వేత, నా యకులు తదితరులు పాల్గొన్నారు.