కొల్లాపూర్, డిసెంబర్ 17 : వరి నాట్లు వేసే సమయంలో కూలీ లు దొరకక రైతులు ఎంతో మదన పడుతుంటారు. ఈ బాధ నుంచి విముక్తి కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణ యం తీసుకున్నది. డ్రమ్సీడర్ పద్ధతిలో వరి సాగును ప్రోత్సహించేందుకు వ్యవసాయాధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. రాష్ట్రంలో ఆరు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా డ్రమ్సీడర్ సాకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు నాగర్కర్నూల్ జిల్లాకు 160 పరికరాలు మంజూరయ్యాయి. వీటిని పర్యవేక్షించేందుకు 80 గ్రా మాల సర్పంచులు, 80 మంది ఏఈవోలకు బాధ్యతలను అప్పగించారు. మొదటి విడుతలో ప్రతి గ్రామపంచాయతీకి నాలు గు పరికరాల చొప్పున 40 గ్రామాలకు 160 డ్రమ్సీడర్లను పంపిణీ చేశారు. ఒక్కో మిషన్ను రోజుకు రూ.250 చొ ప్పున రైతులకు అద్దెకిచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. దీంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొల్లాపూ ర్ వ్యవసాయ డివిజన్ పరిధిలోని నాలుగు మండలాల్లో ఉన్న 11 జీపీలకు 44 డ్రమ్సీడర్లు కేటాయించారు. కొల్లాపూర్ మండలం కుడికిళ్ల, ముక్కిడిగుండం, ఎల్లూరు, చింతలపల్లి, పెంట్లవెల్లి మం డలం కొండూరు, జటప్రోలు, పెద్దకొత్తపల్లి మం డలం గంట్రావుపల్లి, దేవుని తిర్మలాపూర్, కోడేరు మండలం ఎత్తం, పస్పుల, ఠాకూర్తండా గ్రామా లు ఎంపికయ్యాయి.
డ్రమ్సీడర్ పద్ధతి చౌడు నే లలు, నీటి ముంపునకు గు రయ్యే ప్రాంతాలకు అనువుకాదు. పొలం ఎత్తు ప ల్లాలు లేకుండా చదునుగా ఉండాలి. అలా లేకుంటే నీరు నిల్వ ఉండి మొలక మురిగి, మొక్కల సంఖ్య తగ్గిపోతుంది. విత్తిన తరువాత భారీ వర్షం వస్తే విత్తనాలు కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. డ్రమ్సీడర్ పద్ధతిలో కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది. అందుకే కలుపు నివారణ చర్యలు తప్పనిసరి.
– రవి, ఏడీఏ, కొల్లాపూర్
విత్తనాలు విత్తిన తరువాత మొదట్లో నీరు లేకుండా బురదగా మాత్రమే ఉంచాలి. నీరు నిల్వ ఉన్న చోట మొలకరాదు. ఆ తరువాత పలుచగా నీరు (2-3 సెం.మీ.) పిలకలు తొడిగే దశ వరకు ఉంచితే సరిపోతుంది. పైరు పొట్ట దశ నుంచి పంట కోసే 7-10 రోజుల వరకు నాటు వేసిన పొలం మాదిరిగానే నీటి యాజమాన్యం పాటించాలి.
ఎకరా వరి సాగులో ప్రెటిలాక్లోర్ను సేఫ్నర్ మందుకు కలిపి 600-800 మి.లీ. విత్తిన 3-5 రోజుల లోపు లేదా పైరజోసల్ఫ్యూరాన్ ఈథైల్ 80-100 గ్రాములు లేదా బ్యుటాక్లోర్ 1-1.5 లీ. లేదా ప్రెటిలాక్లోర్ 500 మి.లీ. లేదా ఆక్సాడయార్జిల్ 35-45 గ్రాములను 8-10 రోజుల్లో ఇసుకలో కలిపి పలుచటి నీటి పొరపై చల్లాలి. ఎకరాకు సైహలోఫాస్ పిబ్యుటైల్ 300 మి.లీ. (ఊద.ఒడిపిలి) లేదా ఫినాక్స్ ప్రాప్పి ఇథైల్ 350-300 మి.లీ. విత్తిన 15 రోజులకు లేదా బిస్పైరిబాక్ సోడియం 100 మి.లీ. విత్తిన 20 రోజులకు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. బిస్పైరిబాక్ సోడియం వెడల్పాకు గడ్డిజాతిని కూడా ఆరికట్టును. వెడల్పాకు కలుపు నివారణకు 2, 4-డి సోడియం సాల్ట్ ఎకరాకు 400 గ్రాములను విత్తిన 25-30 రోజులకు పిచికారీ చేయాలి. కలుపు రకాన్ని బట్టి మందును ఎంచుకోవాలి.
డ్రమ్సీడర్ డ్రమ్ములో మొలకెత్తిన విత్తనాలను నింపి మూత బిగించాలి. గింజలు రాలడానికి వీలుగా ప్రతి డ్రమ్ములో కేవలం 3/4 వంతు మా త్రమే మొలకెత్తిన గింజలను నింపాలి. గింజలు నింపిన డ్రమ్ పీడర్ లాగితే 8 వరుసల్లో.. వరుసకు, వరుసకు మధ్య దూరం 5-8 సెం.మీ. ఉంటుంది. ఒక్కో కుదురులో 5-8 గింజలు పడుతాయి. కొన్ని అనివార్య కారణాల మూలంగా కుదురులోని గింజలు 50 శాతం దెబ్బతిన్నా మిగిలిన 50 శాతం గింజల నుంచి వచ్చిన మొక్కల సాంద్రత సరిపోతుంది. రకాన్ని బట్టి గింజలు పడే రంద్రాలను స్టాపర్స్తో మూసుకోవాలి. సన్న గింజ రకాలకు రంద్రం వదిలి రంద్రం మూసివేయాలి. 16 వరుసలకు అడుగు వెడల్పు కాలిబాటలు ఉంచుకోవాలి. తాడును వినియోగించి డ్రమ్లాగితే వరుసలు బాగా వస్తాయి. కోనోవీడర్ తిప్పడానికి వీలుగా ఉంటుంది.
వాతావరణంలో మార్పుల మూలంగా వర్షాలు సకాలంలో కురువకపోవడంతో నార్లు పోయడం, నాట్లు వేయడం ఆలస్యం అవుతున్నది. వర్షాలు ఆలస్యమైనా.. నీరు సకాలంలో అందకపోయినా ముదురునార్లతో నాట్లు వేస్తుంటారు. దీంతో దిగుబడులు తగ్గుతున్నాయి. ఈ క్రమంలో నారును నెల రోజులు పెంచి నాటు వేసేందుకు అధిక ఖర్చు అవుతున్నది. నీటి వాడకం కూడా ఎక్కువగా ఉంటున్నది. వరి సాగు పద్ధతిలో డ్రమ్సీడర్తో ప్రత్యామ్నాయం ఏర్పడింది. ఈ పరికరంతో వరిని నేరుగా పొలంలో విత్తుకోవచ్చు. ఈ విధానంలో నారు పెంచి నాటువేసే అవసరం లేదు. నాటుకు అవసరమైన కూలీల ఖర్చు ఆదా చేయొచ్చు. విత్తన మోతాదును సగానికి పైగా తగ్గించొచ్చు. చదరపు మీటరుకు ఉండాల్సిన మొక్కల సంఖ్య కచ్చితంగా ఉండడంతో దిగుబడి పెరుగుతుంది. సాళ్ల మధ్యలో యంత్రాలతో అంతరకృషికి వీలుంటుంది. నాటు వేసిన వరి కంటే 5-7 రోజులు ముందుగానే కోతకు వస్తుంది.
డ్రమ్సీడర్తో వరి నాటేటప్పుడు సాధారణ పద్ధతిలో కంటే వీలైనంత బాగా చదును చేసుకోవాలి. ఎత్తు పల్లాలు లేకుండా సమాంతరంగా ఉండడం చాలా అవసరం. పొలంలో నీరు నిల్వ ఉండొద్దు. నీరు ఎక్కువైతే బయటికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలి. పెద్దగా ఉన్న పొలాలను చిన్న మడులుగా విభజించుకుంటే చదునుచేయడానికి, నీరు పెట్టడానికి, విత్తనం చల్లడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. విత్తే సమయానికి నీరు లేకుండా బురద ఉంటే చాలు. ఇసుక శాతం ఎక్కువగా ఉన్న నేలలో విత్తాలనుకుంటే అదే రోజే ఆఖరి దమ్ము చేసి చదును చేయాలి. పలుచటి నీటి పొర ఉండేలా చూసుకోవాలి. బంక నేలల్లో ఆఖరి దమ్ము చేసి చదును చేసిన మరుసటి రోజే విత్తుకోవచ్చు.
ఆయా ప్రాంతాలు, రకాలకు సిఫార్సు చేసిన ఎరువులనే వాడుకోవాలి. పూర్తి భాస్వరం, సగం పొటాష్ ఎరువులను ఆఖరి దమ్ములో వేయాలి. మిగిలిన పొటాష్ను చిరుపొట్ట దశలో నత్రజని ఎరువులతో కలిపి వేసుకోవాలి. డమ్ములో అధిక నత్రజని ఎరువులు వేసినప్పుడు కలు పు ఎక్కువగా వస్తుంది. నత్రజని ఎరువును మూడు సమభాగాలుగా చేసి 1/3వ భాగం విత్తిన 15-20 రోజులకు.., మిగ తా రెండు భాగాలను పిలక దశలో (విత్తిన 40-45రోజులకు) వేసుకోవాలి. సాధారణంగా ఎకరా వరికి 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను వాడుకోవాలి. దమ్ములో ఒక బస్తా డీఏపీ, 15 కిలోల మ్యూ రేట్ ఆఫ్ పొటాష్ వేసుకొని, విత్తిన 15 రోజులకు పిలక దశలో, చిరుపొట్ట దశలో ఎకరాకు 32 కిలోల చొప్పున యూరియా చట్టుకోవాలి. ఆఖరి దఫా యూరియాతోపాటు 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ తప్పనిసరి.
విత్తన రకాన్ని బట్టి ఎకరాకు 10-15 కిలోలు అవసరమవుతాయి. కాం డం గట్టిగా ఉండి వేరు వ్యవస్థ దృఢంగా ఉండి పడిపోని రకాలు మిక్కిలి అనుకూలం. ఆయా ప్రాంతానికి అనువైన, రైతుకు ఇష్టమైన వాటిని సాగు చేసుకోవచ్చు. లీటరు నీటికి ఒక గ్రాము కార్బండిజమ్ కలిపిన ద్రావణంలో విత్తనాలను 12 గంటలు నానబెట్టి.. 24 గంటలు మండెకట్టి.. కొద్దిగా ముక్కు పగిలిన గింజలను వాడుకోవాలి.