నాగర్కర్నూల్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ) ; ఉమ్మడి పాలమూరు జిల్లాపై చలి పంజా వి సురుతోన్నది. పొద్దస్తమానం ఎండ తీవ్రత ఉం టుండగా.. పొద్దుగూకితే శీతల గాలులు వణికిస్తున్నాయి. ఉత్తర, ఈశాన్య దిశ గాలుల ప్రభావంతో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలికాలం మధ్యదశకు చేరడంతో తీవ్ర త ఎక్కువైంది. దీనికి తోడు ఐదు జిల్లాలను మం చు దుప్పటి కప్పేస్తున్నది. సోమవారం పలు ప్రాంతాలంతా పొగమంచుతో నిండిపోయా యి. ఉదయం 9 గంటల వరకు భానుడు సైతం మంచులో చిక్కుకున్నాడు. రోడ్లు కనిపించకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డా రు. వాహనాలన్నీ లైట్ల వెలుతురులో రాకపోక లు సాగించాయి. మంకరలో పల్లె, పట్నాలు స రికొత్త అందాలతో కనువిందు చేశాయి. ముగ్ధమనోహరంగా మారిపోయాయి. మరో మూ డ్రోజులు చలి ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ సూచనలతో ప్రజలు, పిల్లలు, వృద్ధులు అ ప్రమత్తంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.
ఉమ్మడి జిల్లాల్లో చలి పులిలా బెంబేలెత్తిస్తోంది. శీతాకాలం మధ్యలో ఉండటం జనవరి సమీపిస్తుండడంతో ఈ చలి ప్రభావం మరింత చూపిస్తోంది. సంక్రాంతికి ముందే చుక్కలు చూపిస్తోంది. పక్షం నుంచి రోజురోజుకూ పెరుగుతుండటంతోపాటుగా క్రమంగా ఊష్ణోగ్రతలూ పడిపోతున్నాయి. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వారం కిందట తుఫాన్ ప్రభావంతో ఏర్పడిన చల్లదనంతో నాలుగైదు రోజులు ప్రజలు తల్లడిల్లారు. తాజాగా మరో మూడ్రోజులు చలి ప్రభావం పెరుగుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో ప్రజలు ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, ఇతర అనారోగ్య సమస్యలున్న వారు జాగ్రత్తగా ఉండాల్సిందిగా వైద్యు లు సూచిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వర కు ఎండ ప్రభావం చూపిస్తుండగా సూర్యుడు అస్తమించడంతో చల్లదనం పెరుగుతున్నది.
దీనివల్ల ఒక్క రోజు లో ఎండలు, చలి తీవ్రతలో తేడాలతో మారుతున్న వాతావరణం మనుషుల ఆరోగ్యంపై ప్రభావం చూపనున్నాయి. ఫలితంగా సాయంత్రం నుంచి ఇండ్లకే పరిమితమవుతున్నారు. షాపింగ్ మాల్స్, రైతుబజార్లు, ఇతర వ్యాపార సముదాయాలు రాత్రి 8 గంటలకే మూతబడుతున్నాయి. సాయంత్రం 5:30 నుంచే చీకటి అవుతుండడంతో మరుసటి రోజు ఉదయం 6:30 గంటల తర్వాతే వెలుతురు కనిపిస్తోంది. ఉదయం 10 గంటల వరకూ చలి తీవ్రత కనిపిస్తోంది. చలిని తట్టుకునేందుకు స్వెట్టర్లు, మంకీ క్యాప్లు, సాక్స్లు, గ్లోవ్స్తో పాటుగా రూం హీటర్లను తెచ్చుకొని చలి నుంచి రక్షణ పొందుతున్నారు. చలి కోట్లు, టోపీలు అమ్మే వారి వ్యాపారం ఊపందుకున్నది. పలు పట్టణాల్లో రోడ్లపై దుకాణాలు ఏర్పాటు చేసి ఈ దుస్తులు విక్రయిస్తున్నారు. ఇక ప్రస్తుతం కరోనా ప్రభావం చూపుతుండడంతో మరింత జాగ్రత్తగా ఉండే పరిస్థితులు ఉన్నాయి.
కమ్మేసిన మంకర
రెండ్రోజుల నుంచి పెరిగిన చలితో పట్టణాలు, పల్లెలు తేడా లేకుండా పొగ మంచు కమ్మేస్తున్నది. సోమవారం ఉదయం 9 గంటల వరకూ పలు ప్రాంతాలను పొగమంచు చుట్టుముట్టింది. ఇండ్లు, రోడ్లు కనిపించకుండా దట్టంగా కమ్మేసిన మంచును చూసి పిల్లలు సంతోషడ్డారు. అయితే వాహనదారులకు మాత్రం రోడ్లు కనిపించకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. ఇదిలా ఉంటే నల్లమలలో చలి ప్రభావం అధికంగా ఉన్నది. మన్ననూర్ నుంచి అమ్రాబాద్ వరకు ఉన్న అటవీ ప్రాంతంలో మంచు, చలితో ప్రజలు సాయంత్రమైతే ఇండ్లకే పరిమితమవుతున్నారు. వాహనదారులు సాయంత్రం వరకే ఇండ్లకు చేరాలని, మంచుతో రోడ్లు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నదని రవాణాశాఖ అధికారులూ సూచిస్తున్నారు.
పడిపోయిన ఊష్ణోగ్రతలు
నాగర్కర్నూల్ జిల్లాలో ఊష్ణోగ్రతలు పడిపోయా యి. సాయంత్రం వేళల్లో 21 డిగ్రీలకు కనిష్ఠంగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో జిల్లాలోని కోడేరులో అత్యధికంగా 31 డిగ్రీల గరిష్ఠంగా నమోదుకాగా చారకొండలో 17.9 కనిష్ఠంగా డిగ్రీలు నమోదైంది. జిల్లా సరాసరి చూస్తే గరిష్ఠంగా 31.1 డిగ్రీలు ఉండగా.. కనిష్ఠంగా 17.1 డిగ్రీలుగా ఉన్నది. ఇలా సంక్రాంతి రాబోతున్న తరుణంలో చలి ప్రభావం పెరుగుతూ వస్తున్నది.
ప్రజలు జాగ్రత్తగా ఉండాలి
చలితోపాటు గాలులూ వీస్తుండటంతో ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. పిల్ల లు, వృద్ధులతో పాటు ఆస్త మా, గుండె జబ్బులున్న వారు చలికి బయటికి రావొద్దు.. ప్రతి ఒక్కరూ స్వెట్టర్లు, తల, చెవులు కప్పి ఉంచేలా టోపీలు, వీలైతే చేతులకు గ్లోవ్స్, కాళ్లకు సాక్స్ ధరించాలి. పగటి వేళల్లోనే మార్కెట్, ఇతర పనులు ముగించుకోవాలి. అత్యవసరమైతేనే రాత్రి వేళల్లో ప్రయాణాలు చేయాలి.
– సుధాకర్లాల్, డీఎంహెచ్వో, నాగర్కర్నూల్