నారాయణపేట, జూన్ 18 : వలసల పాపం ముమ్మాటికి కాంగ్రెస్, టీడీపీ పాలకులదేనని పేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి పేర్కొన్నారు. పుణెలో నారాయణపేట గిరిజన ప్రజల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే, మహారాష్ట్ర బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ హరిబౌ రాథోడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గిరిజనులు డప్పు వాయిద్యాల మధ్య, బంజారా నృత్యం చేస్తూ పూల వర్షం కురిపిస్తూ ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. సంత్ సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి నివాళులర్పించి భవానీ మాత చిత్రపటానికి పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో పాలించిన కాంగ్రెస్, టీడీపీ వల్లే తెలంగాణ ప్రజలు ఇక్కడికి వలసొచ్చారని.. ఈ పాపం ముమ్మాటికి వారికే దక్కుతుందన్నారు. బీఆర్ఎస్ పాలనలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తెలంగాణకే వలసొస్తున్నారని గుర్తు చేశారు. రెండు, మూడు దశాబ్దాల కిందట పుణేకు వ లసొచ్చి స్థిరపడిన వారిని కలుద్దామని ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. తెలంగా ణ ఏర్పాటయ్యాక సీఎం కేసీఆర్ చేపట్టిన కార్యక్రమాలతో వలసలు ఆగిపోయాయన్నారు. గత ప్రభుత్వాలు ప్రజలను ఓటు బ్యాంకుగా చూశారే తప్పా.. వారి బాగోగులు పట్టించుకోలేదని విమర్శించారు. అప్నా గావ్.. అప్నా రాజ్ అంటూ 75 ఏండ్లుగా డిమాండ్ చేస్తున్న బంజారాలను పరిపాలనకు దూరం చేశారని, ఇప్పుడు రా ష్ట్ర వ్యాప్తంగా 3,146 తండాలను సీఎం కేసీఆర్ జీపీలుగా మార్చారన్నారు. పేట నియోజకవర్గంలోనే 26 తండాలను పీలుగా మార్చి గిరిజనులకే పాలన అందించామన్నారు. బంజారాల దశాబ్దాల కలను సీఎం కేసీఆర్ సాకారం చేశారన్నారు. పేట నియోజకవర్గంలో రూ.60కోట్లతో తండాల్లో రోడ్లు నిర్మించినట్లు తెలిపారు. తండాలను అభివృద్ధి చేసినందుకే మీ దగ్గరికి వచ్చి సమావేశం అవుతున్నామని ఎ మ్మెల్యే వివరించారు. కార్యక్రమంలో పేట బీఆర్ఎస్ నాయకులు రవికుమార్, రాములు, మురళీధర్రెడ్డి, శ్రీనివాస్రె డ్డి, మల్లయ్యయాదవ్, రాజవర్ధన్రెడ్డి, మహేశ్, రాజు, సిం ధూచౌహాన్, రమేశ్నాయక్, మాధవరెడ్డి, ప్రసాద్బాబు, లక్ష్మారెడ్డి, నాగిరెడ్డి, శ్రీనూనాయక్, చక్రీనాయక్, హరినాయక్, పుల్సింగ్, వాసూనాయక్, గేమ్యానాయక్, శంకర్పవార్, హాబ్యానాయక్, హన్యానాయక్, పూర్వానాయక్, లక్ష్మ ణ్ నాయక్, వెంకట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.