తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను భావితరాలు గుర్తుంచుకు నేలా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం కసరత్తు చేపట్టింది. అమరుల తాగ్యాలను స్మరిస్తూ.. 21 రోజుల పాటు వేడుకలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. జెండావిష్కరణతో మొదలు.. అమరుల స్మరణతో ముగించేలా చర్యలు చేపట్టారు. రోజుకో విభిన్న కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రభుత్వ కార్యాలయాలను విద్యుద్దీపాలతో ముస్తాబు చేశారు. తెలంగాణ ఘనకీర్తిని చాటాలని మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యేలు పిలుపునిచ్చారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కార్యక్రమాలను పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు సమిష్టిగా అడుగులు వేస్తున్నారు. కాగా 6వ తేదీన నాగర్కర్నూల్, 12న గద్వాల జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్లను ప్రారంభిం చనున్నారు. ఇందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
మహబూబ్నగర్, జూన్ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు భావితరాలు గుర్తుంచుకునేలా అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. పదేళ్లల్లో జిల్లాల ప్రగతిని ప్రతిబింబించేలా.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉత్సవాలకు ఉమ్మడి జిల్లా సర్వం సిద్ధమైంది. ఈ ఉత్సవాల్లో తెలంగాణ ఘనకీర్తిని చాటిచెప్పేలా పండుగ వాతావారణంలో అంబరాన్నంటేలా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈమేరకు ఆయా జి ల్లా కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాలు, వివిధ ప్రభు త్వ శాఖల కార్యాలయాలను విద్యుద్దీప కాంతులతో ముస్తాబు చేశారు. స్వరాష్ట్ర కల సిద్ధించి పదేండ్లయిన సందర్భంగా ఏర్పాటు చేసే ఉత్సవాలకు ప్రతి ఒక్కరినీ భాగస్వాములు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. శుక్రవారం నుంచి 22వ తేదీ వరకు 21రోజులుపాటు అట్టహాసంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
విద్య, వైద్యం, వ్యవసాయం, వివిధ రంగాల్లో అభివృద్ధిని కళ్లకు కట్టేలా నిర్వహించనున్నారు. తొలిరోజు జాతీయ పతాకం ఆవిష్కరణతో వేడుకలు మొదలై అమరులకు నివాళులర్పించే కార్యక్రమంతో ముగియనున్నాయి. ఉత్సవాలకు ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మం త్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు సమిష్టిగా అడుగులు వేస్తున్నారు. వనపర్తి, గద్వాల, నాగర్కర్నూల్ జిల్లాల్లో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి, మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల్లో ఎక్సైజ్, క్రీడా మంత్రి శ్రీనివాస్గౌడ్ సమీక్షలు నిర్వహించి దిశానిర్దేశం చేశారు. పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు. నిర్వహణ కోసం ఒక్కో జిల్లాకు రూ.2.70కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది . కాగా దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 6న నాగర్కర్నూల్కు, 12న జోగుళాంబ గద్వాల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. 8న జడ్చర్లలో మంత్రి కేటీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించనున్నారు. అన్ని రంగాల్లో సాధించిన విజయాలను వివరిస్తూ దశాబ్ది ఉత్సవాలు కనులపండువగా నిర్వహించడంలో అధికారులు నిమగ్నమయ్యారు.
పచ్చబడుతున్న పాలమూరు
కరువు, కాటకాలు, వలసలకు నిలయమైన ఉమ్మడి పాలమూరు జిల్లా తెలంగాణ ఏర్పడ్డాక పూర్తిగా మారిపోయింది. సీఎం కేసీఆర్ విజన్తో వలసల పేరు శాశ్వతంగా తుడిచిపెట్టుకుపోయింది. దశాబ్దాల తరబడి పెండింగ్లో ఉంచిన ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చేశారు. అన్ని ప్రాజెక్టులను దశల వారీగా పూర్తిచేసి పాలమూరు బీడు భూములకు నీళ్లందించారు. జూరాల, ఆర్డీఎస్, కల్వకుర్తి, భీమా ఫేజ్-1, ఫేజ్-2, కోయిల్సాగర్, నెట్టెంపాడు, మైనర్ ఇరిగేషన్, ఐడీఎస్ స్కీమ్లతో ఉమ్మడి జిల్లా ఆయకట్టుకు సాగునీరు అందించారు. ఎండాకాలంలో కూడా చెరువులు మత్తడి దుంకేలా చేశారు. చెరువులు, వాగులు, వంకల్లో జలసిరులను ఒడిసిపట్టి పాలమూరు జిల్లా దశదిశను మార్చిన ఘనత కేసీఆర్దే.. 2014కు ముందు ప్రాజెక్టులు మైనర్ ఇరిగేషన్ స్కీంలు కలిపి కేవలం 2,28, 386 ఎకరాలకు సాగునీళ్లిస్తే.. తొమ్మిదేండ్లలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి 2023లో 11 లక్షల 151ఎకరాలకు రికార్డు స్థాయిలో ఆయకట్టుకు నీళ్లిచ్చారు. బోర్లు, చెక్డ్యామ్లు, వాగులతో మ రో 3లక్షల ఎకరాలకు సాగునీరు అందించారు. వానకాలంలో 6 లక్షలకుమించి సాగని పరిస్థితి ఉన్న ఉ మ్మడి జిల్లాలో 2022 వానకాలంలో ఏకంగా 16 లక్షల ఎకరాలు సాగు చేసి పాలమూరు జిల్లా చరిత్రను తిరగరాశారు. 2022 యాసంగి సీజన్లో 12 లక్షల ఎకరాలు సాగుబడిలో వచ్చింది. దీంతో నేడు పాలమూరు సస్యశ్యామలమైంది. వలస నిలిచిపోయి తొమ్మిదేండ్లలో పాలమూరు జిల్లా స్వరూపమే మారింది.
పారిశ్రామిక అడ్డాగా..
నాడు ఉపాధి కోసం ఇతర రాష్ర్టాలకుపోయిన ఈ ప్రాంతం నేడు ఇక్కడే వందల మందికి ఉపాధినిచ్చే స్థాయికి ఎదిగింది. ఉమ్మడి జిల్లాలో అనేక పరిశ్రమలు రావడంతో పారిశ్రామిక అడ్డాగా మారింది. మహబూబ్నగర్, నాగర్కర్నూల్, గద్వాల, నారాయణపేట, వనపర్తి జిల్లాలో చిన్నచిన్న పరిశ్రమలు మొదలుకొని పెద్దపెద్ద ప్రైవేటు కంపెనీల భాగస్వామ్యంతో పరిశ్రమలు వెలిశాయి. దీంతో వేలా ది మంది బాలానగర్ పారిశ్రామిక ప్రాంతంలో, పోలేపల్లి సెజ్లో, వనపర్తి జిల్లాలో చెరుకు, బేవరేజెస్ కం పెనీల రాకతో పారిశ్రామిక ప్రాంతంగా ప్రసిద్ధి చెం దింది. కల్వకుర్తి నియోజకవర్గం, రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రైవేటు కంపెనీలు పెట్టుబడి పెట్టడానికి ముందుకొస్తున్నాయి. జడ్చర్ల పారిశ్రామిక అడ్డా గా మారిపోయింది. దీంతో ఇతర రాష్ర్టాల నుంచి వ చ్చే వారితో జిల్లా స్వరూపమే మారింది.
ఐటీ టవర్ వద్ద బ్యాటరీ కంపెనీ
మహబూబ్నగర్ జిల్లాకేంద్రం సమీపంలో దేశంలోనే తొలిసారిగా లిథియం ఫ్యాక్టరీకి మే 6న మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. రూ. 10వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న అమరరాజ కంపెనీని 170 ఎకరాల భూమిని కేటాయించారు. ఐటీ, ఎనర్జీ పార్కును ఏర్పాటు చేయడంతోపాటు ఐటీ టవర్ను ప్రారంభించారు. దీంట్లోనే సాఫ్ట్వేర్, ఎనర్జీ పార్కుకు శ్రీకారం చుట్టారు. హైవే-44కు, శంషాబాద్ ఎయిర్పోర్టుకు గంటన్నర దూరంలోనే ఉన్న ఐటీ కారిడార్లో పరిశ్రమలు స్థాపించేందుకు ఎందరో ఔత్సాహిక పారిశ్రమికవేత్తలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే ఐటీటవర్లో స్టార్టప్ కంపెనీలు పెట్టాలని ఈ జిల్లాకు చెందిన ఎన్ఆర్ఐలకు మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆహ్వానం పంపారు. ఇప్పటికే 8 సాఫ్ట్వేర్ కంపెనీలు వారి కార్యకలాపాలను ప్రారంభించాయి.
మెడికల్ హబ్గా పాలమూరు
విద్య, వైద్యం కోసం హైదరాబాద్కు పరుగుపెట్టాల్సిన అవసరం లేకుండానే సీఎం కేసీఆర్ ఆశీస్సులతో మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా మెడికల్హబ్గా మారింది. తెలంగాణ ఆవిర్భవించాక తొలిమెడికల్ కాలేజీని జిల్లాకు చెందిన నాటి ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి మంజూరు చేశారు. రూ.150 కోట్లతో మెడికల్ కాలేజీని పూర్తి చేసుకుని రాష్ట్రంలో ప్రధాన మెడికల్ కాలేజీలతో పోటీపడ్తుంది. రూ.3.8 కోట్లతో మోడల్ రూరల్ హెల్త్ రీసెర్చ్ను యూనిట్ కలిగిన ఏకైక మెడికల్ కళాశాలగా గుర్తింపు తెచ్చుకుంది. పీజీ సీట్లను కూడా సాధించింది. పారా మెడికల్ కోర్సులను ప్రవేశపెట్టారు. నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల్లో మరో రెండు మెడికల్ కాలేజీలు విద్యసంవత్సరం ప్రారంభం అయ్యాయి. భవనాలను కూడా సిద్ధం చేస్తున్నారు. గద్వాల, నారాయణపేట జి ల్లాలకు కూడా కొత్తగా మెడికల్ కాలేజీలను ము ఖ్యమంత్రి కేటాయించారు. రూ.2,500 కోట్లతో ఐదు మెడికల్ కాలేజీలు ఉన్న ఒకే ఉమ్మడి జిల్లా మహబూబ్నగర్ కావడం గమనార్హం. అన్ని జిల్లాకేంద్రాల్లో 5 వందల బెడ్లతో టీచింగ్ దవాఖానలు నిర్మిస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో రూ. 3 వందల కోట్లతో వెయ్యిపడకల దవాఖాన నిర్మిస్తున్నారు. అన్ని జిల్లాకేంద్రాల్లో ప్రభుత్వ దవాఖానలను అప్గ్రేడ్ చేసి వసతులు పెంచారు. నియోజకవర్గ కేంద్రాలైన జడ్చర్ల, అచ్చంపేట, నారాయణపేట, కొడంగల్, గద్వాల, అలంపూర్, నాగర్కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తిల్లో వంద పడకల దవాఖానలు ఏర్పాటు చేసి పేద లకు వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చారు.
తాగునీటి కష్టాలకు చెక్..
ఉమ్మడి జిల్లాలో తాగునీటి కోసం రణమే జరిగేది. దీంతో తాగునీటి కష్టాలకు చెక్ పడింది. మహబూబ్నగర్లో 14 రోజులకోసారి నీళ్లు వచ్చేవి.. వనపర్తి, నాగర్కర్నూల్, గద్వాల, నారాయణపేట జిల్లాల్లో వారానికోసారి సరఫరా అయ్యేవి. నారాయణపేట పట్టణంలో ఫ్లోరైడ్ వాటర్ సమస్య.. ఆడపడుచులు పడుతున్న కష్టాలను చూసిన సీఎం కేసీఆర్ మిషన్ భగీరథతో శుద్ధమైన తాగునీటిని సరఫరా చేశారు.
కొత్త జిల్లాల ఏర్పాటుతో…
తెలంగాణ వ చ్చాక పరిపాలనా సౌలభ్యం కోసం సీఎం కేసీఆర్ చిన్నచిన్న జిల్లాను ఏ ర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లాను ఐదు జిల్లాలుగా విభజించారు. చిన్నచిన్న జిల్లాలు ఏర్పాటు కావడంతో పరిపాలన మరింత సులభమైంది. అన్ని జి ల్లాలు అభివృద్ధిలో పరుగులు పెడ్తున్నాయి. రూ.కోట్ల నిధులు వెచ్చించి కార్యాలయ భవనాలు, మౌలిక సదుపాయాలను కల్పించారు. రహదారుల సమస్యలకు మోక్షం వచ్చింది. ఆధునిక హంగులతో అన్ని జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయ భవనాలు నిర్మించారు. అన్ని జిల్లాలో వేగంగా అభివృ ధ్ది సాధిస్తుండటంతో ఉమ్మడి జిల్లా రుపురేఖలే మారిపోయాయి. జిల్లా కేంద్రాలు పట్టణాలను తలపిస్తున్నాయి. విశాలమైన రహదారులు, సెంటర్లైటింగ్ ఇతరాత్ర సౌకర్యాలు కల్పించటంతో అభివృద్ధిలో పోటీపడ్తున్నాయి.
వచ్చే నెలకల్లా ‘పాలమూరు’ నీళ్లు
పాలమూరు ఎత్తిపోతల పథకానికి 2015 జూలైలో సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. మహబూబ్నగర్, రంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ జిల్లాలకు తాగునీరు, 12.30లక్షల ఎకరాలకు సాగునీరు అందించే పథకం పనులు శరవేగంగా సాగుతున్నాయి. అయితే కొందరు నాయకులు గ్రీన్ట్రిబ్యునల్లో కేసులు వేసి వేసి ఇతర రాష్ర్టాలతో చేతులు కలిపి ప్రాజెక్టు పనులను అడ్డుకున్నారు. అత్యున్నత న్యాయస్థానంలో తాగునీటి అవసరాలకు అనుమతి రాగానే పనులను శరవేగంగా చేపట్టింది. ఈ నెలాఖరు కల్లా , లేదా వచ్చేనెల మొదటి వారంలోగా రిజర్వాయర్లను నింపి తాగునీరు, సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకున్న ది… ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఉమ్మడి జి ల్లాలో ఊపందుకున్నాయి. 70 ఏండ్లలో జరగని అభివృద్ధి తొమ్మిదేండ్లలో చేసి చూపించారు సీఎం కేసీఆర్. ఇటు మంత్రులు శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డితోపా టు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దూసుకెళ్తున్నారు. ము ఖ్యమంత్రికి సమస్యలు విన్నవించి నిధుల వరద పా రించారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలతో గ్రామాల రుపురేఖలే మారిపోయాయి. దీం తో పాలమూరు జిల్లా హైదరాబాద్తో పోటీపడ్తున్నది.