కొల్లాపూర్, సెప్టెంబర్ 13 : సీఎం కేసీఆర్ శనివా రం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన అనంతరం కృష్ణాజలాలను తీసుకె ళ్లి ఆలయాల్లో దేవుళ్ల పాదాలు కడగాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆ జలాల ను చెరువులు, కుంటల్లో చల్లుకోవాలని రైతాంగానికి పిలుపునిచ్చారు. 16న సీ ఎం కేసీఆర్ కొల్లాపూర్కు వస్తున్న సందర్భంగా భారీ బహిరంగసభకు వచ్చే వాహనాల పార్కింగ్ స్థలాలను బుధవారం పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి, కలెక్టర్ ఉదయ్కుమార్తో కలిసి కొబ్బరికాయ కొట్టి సభా నిర్మాణ పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. 16న నార్లాపూర్ కం ట్రోల్రూం వద్ద సీఎం కేసీఆర్ స్విచ్ ఆన్ చేస్తారన్నారు. తొలుత నార్లాపూర్ రిజర్వాయర్ నింపుకొ ని ఏదుల, వట్టెం, కరివెన, ఉదండాపూర్ రిజర్వాయర్లను దశల వారీగా నింపుతామన్నారు. కరు వు, వలసలతో తల్లడిల్లిన ఉమ్మడి జిల్లాతోపాటు దక్షిణ తెలంగాణ పీఆర్ఎల్ఐ ప్రాజెక్టుతో కోనసీమ ను తలపించనున్నదన్నారు. గ్రామాల నుంచి రైతు లు, కూలీలు సభకు భారీగా తరలివచ్చేందుకు ఆ సక్తి చూపుతున్నారన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ శాంతకుమారి, డీసీసీబీ డైరెక్టర్ రఘునందన్రెడ్డి, గొర్రెల కాపరుల సహకార సంఘం ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్యాద వ్, నరేందర్రెడ్డి, జంబులయ్య తదితరులున్నారు.