కోస్గి, మే 5 : తెలంగాణ అన్నింటా అగ్రగామిగా ఉం డాలన్నా, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలన్నా అది బీఆర్ఎస్ పార్టీతోనే, కేసీఆర్తోనే సాధ్యమని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం కోస్గిలో మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎమ్మె ల్యే పట్నం నరేందర్రెడ్డితో కలిసి మాజీ మంత్రి రోడ్షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఎన్నో కష్టనష్టాలకు గురైందని తెలంగాణ తల్లి విముక్తి కోసం పోరాడి తెలంగాణ సా ధించింది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనే.. అదే విధం గా పదేండ్ల పాటు బంగారు తెలంగాణగా అభివృద్ధి చేసి న ఘనత కూడా ఆయనకే సొంతం అన్నారు. కానీ దురదృష్టవశాత్తు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన వంద రోజులు గడిచినా హామీలు అమలు చేయడం లేదని, దీంతో అప్పుడే ఈ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని గుర్తు చేశారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ మధ్య పో టీ ఉందన్నారు. కానీ బీజేపీ ప్రభుత్వం సెంటిమెంట్తో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. ఇం టింటికీ అక్షింతలు పంపించి ఓట్లు అడుగుతున్నారన్నా రు. రామమందిరం నిర్మాణం ప్రజలు ఏర్పాటు చేసిన ట్రస్టుతో నిర్మించబడిందన్నారు. బీజేపీ ప్రభుత్వం మతాల మధ్య చిచ్చుపెడుతూ ఓట్ల రాజకీయం చేస్తోందని ఆరోపించారు. దేశంలో ఏ నాయకుడైనా గట్టిగా మాట్లాడితే బీజేపీ ప్రభుత్వం గొంతు నొక్కుతుందన్నా రు. పార్లమెంటులో తెలంగాణ గురించి మాట్లాడిన నా యకుడు మన్నె శ్రీనివాస్రెడ్డి అని, ఆయన ఐదేండ్లు ఎంపీగా ఉండి 358 ప్రశ్నలు అడిగారని గుర్తు చేశారు.
పాలమూరు ఎంపీ అభ్యర్థి ఓడిపోతాడన్న ఇంటలిజెన్స్ రిపోర్ట్స్తో కొడంగల్లో 5 సార్లు ముఖ్యమంత్రి హోదాలో పర్యటించారని, కొడంగల్ నుంచి 50వేల మెజార్టీ వస్తుందని రేవంత్రెడ్డి చెబుతున్నాడు, 50వేల మెజార్టీ రాకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తావా అని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు అరిగోస పడుతున్నారని, కరెంట్ లేక మోటర్లు కాలిపోయి పంటలు ఎండిపోయి ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఆత్మహత్యలు లేని తెలంగాణ కేసీఆర్తోనే సాధ్యమని, అందుకే ఎంపీగా మన్నెను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో కొడంగల్ ఎన్నికల ఇన్చార్జి అల్లీపురం వెంకటేశ్వర్రెడ్డి, గ్రం థాలయాల సంస్థ మాజీ చైర్మన్ శాసం రామకృష్ణ, నా యకులు మైపాల్, సలీం, బాల్సింగ్నాయక్, చాంద్పాషా తదితరులు ఉన్నారు.
కేసీఆర్ను తిట్టడమే రేవంత్ పనా..? అందుకోసమే సీఎం అయ్యాడా? రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మూట గట్టుకున్నది. కేసీఆర్ రాష్ర్టాన్ని సాధించి తెలంగాణ ప్రయోజనాల కోసం నిత్యం శ్రమించి రైతు లు, మహిళలు, వృద్ధులతోపాటు అన్ని వర్గాలకు లబ్ధి చేకూర్చారు. 24 గంటల కరెంట్, కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్ వంటి అనేక పథకాలను ప్రవేశపెట్టి దేశానికే ఆదర్శంగా నిలిచారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఒక్కటి కూడా సక్రమంగా అమలు చేయడం లేదు. బీజేపీ ప్ర భుత్వం తెలంగాణలో ఉన్న ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హో దా ఇవ్వలేదు. పైగా తెలంగాణకు వచ్చే నిధులను కూడా అడ్డుకున్నది. ఎంపీగా ఆశీర్వదిస్తే.. అందుబాటులో ఉండి మీకు సేవ చేస్తా. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఐదు నెలలైనా హామీలను అమలు చేయడం లేదు. ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతు న్నా రేవంత్ సర్కారు పట్టించుకోవడం లేదు.
జడ్చర్లటౌన్, మే 5 : గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కారు గా లికొదిలేసిందని, మరోసారి కాంగ్రెస్ను నమ్మితే మోసపోతామని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం బీఆర్ఎస్ మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డితో కలిసి జడ్చర్లలోని నిమ్మబావిగడ్డ ప్రాంతంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ అలవికాని హామీలతో ప్రజలను మోసం చేసిన కాం గ్రెస్, బీజేపీ పార్టీలకు పార్లమెంట్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు నిమ్మబావిగడ్డ ప్రాంతంలో మహిళలు ఎంపీ అ భ్యర్థి మన్నెకు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ దోరెపల్లి లక్ష్మి, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, మే 5 : ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల తర్వాత ఉంటుందన్న గ్యారెంటీయే లే దని, ఇక ఆరు గ్యారెంటీలు ఎలా అమలు చేస్తారని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. మహబూబ్నగర్లోని ఏనుగొండలో మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డికి మ ద్దతుగా మాజీ మంత్రి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్గౌడ్ మా ట్లాడుతూ ఇప్పటికే కాంగ్రెస్కు ఓటేసి మోసపో యి గోసపడుతున్నామని, మరోసారి అలా మో సపోవద్దని సూచించారు. మహబూబ్నగర్తోపాటు రాష్ట్రం బాగుండాలంటే ఒక్క కేసీఆర్తోనే సాధ్యమని, అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో మ న సత్తా చూపించాలని పిలుపునిచ్చాడు. కాంగ్రె స్ ఇచ్చిన హామీల్లో పెంచిన పింఛన్ ఇవ్వడం లే దని, ఆడ పిల్లల పెండ్లికి తులం బంగారం కూ డా ఇవ్వడం లేదని ఆరోపించారు. 2014 కంటే ముందు మహబూబ్నగర్ ఆ తరువాత 9 ఏం డ్లలో జరిగిన అభివృద్ధి చూడండని తెలిపారు. మహబూబ్నగర్లో జరిగిన అభివృద్ధిని చూసి ప్రతిపక్ష పార్టీల నాయకులు సైతం ఆశ్చర్య పోతున్నారు. ఏనుగొండను పూర్తిస్థాయిలో అభివృద్ది చేశామని, ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డిని గెలిపిస్తే స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేసే అవకాశం ఉందని అందుకే మన్నెను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, డీసీసీబీ వైస్ చైర్మన్ వెంకటయ్య, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.