వనపర్తి, ఆగస్టు 5 : రైతులకు సబ్సిడీ ని ఇస్తూ ఆయిల్పాం సాగుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని, దీంతో భవిష్యత్తులో దేశానికి తెలంగాణ రోల్మోడల్గా మారనున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. శనివారం అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి నిరంజన్రెడ్డి ఆయిల్పాం సాగు, రాయితీ, లాభాలపై మాట్లాడారు. ప్రతి మనిషి ఏటా సగటున 19 కిలోల ఆయిల్ను వాడుతారని, ఆ లెక్కన దేశ వ్యా ప్తంగా 250 లక్షల మెట్రిక్ టన్నుల ఆయి ల్ అవసరమవుతుందన్నారు. కానీ, ప్రస్తుతం 132 లక్షల మెట్రిక్ టన్నుల ఆయిల్ మాత్రమే దేశంలో ఉత్పత్తి అవుతుందన్నారు. ఆయిల్ను దిగుమతి చేసుకోవద్దంటే స్వయం సమృద్ధి సాధించాలన్నారు.
దేశవ్యాప్తంగా 70 లక్షల ఎకరాల్లో ఆయిల్పాం సాగు చేయాన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఎకరాల్లో సాగు చేయాలనే లక్షంతో దశలవారీగా ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు. గడిచిన ఏడాది కాలంగా 1.18 లక్షల ఎకరాల్లో ఆయిల్పాం ప్లాంటేషన్ చేశామని, ఈ ఏడాది 2.30 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యం పెట్టుకున్నామన్నారు. శుక్రవారం నాటికి 20,570 ఎకరాల్లో మొక్కలు నాటినట్లు సభ్యులకు వివరించారు. రా ష్ట్ర వ్యాప్తంగా 30 జిల్లాల్లో ఆయిల్పాం జోన్లుగా కంపెనీల ఏర్పాటుకు అనుమతి ఇచ్చామన్నారు. ఆంధ్రప్రదేశ్ రా ష్ట్రంలో ఆయిల్పాం ప్లాంటేషన్కు సంబంధించి తెలంగాణకు రిక్వెస్ట్ వచ్చిందని.. అదనంగా ఉంటే తమకు ఇవ్వాలని అడిగారన్నారు. ఆయిల్పాం సాగు చేసిన తరువాత పంట చేతికి వచ్చేందుకు 3 నుంచి 4 ఏండ్లు పడుతుందని.. అప్పటిలోగా రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాక్టరీ పనులను పూర్తి చేయాలని నిబంధనలు విధించామన్నారు.
ఇప్పటికే వనపర్తి, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలో ఫ్యాక్టరీ ఏర్పాటుకు సీ ఎం కేసీఆర్తో చర్చించి 40 నుంచి 45 ఎకరాలను కేటాయించామన్నారు. కేం ద్ర ప్రభుత్వం టన్నుకు రూ.13,500 ఇస్తే.. రాష్ట్రంలో ఓటీఆర్ ప్రకారం రూ.17 వేల నుంచి రూ.17,500 వరకు ఇస్తున్నామన్నారు. ఆయిల్పాం సాగుకు రైతులందరూ ముందుకు రావాలని కోరారు.