వెల్దండ, జూలై 31: మండలంలోని మర్రిగుంత తండా జీపీ గాజులోని బావితండాకు చెందిన రామావత్ మల్లేశ్ గ్రామ పంచాయతీ పరిధిలోని గాజులోని బావితండాకు చెందిన రామావత్ రాజు తన భార్య బుజ్జ్జి, కొడుకు మల్లేశ్ (20)తో కలిసి హైదరాబాద్లోని బాలాపూర్ నుంచి తన స్వగ్రామం గాజులోని బావితండాకు బయలుదేరాడు. సీత్లా పండుగకు బైక్పై వస్తుండగా రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రంలో టోల్గేట్ సమీపంలో పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోసుకొని రోడ్డుపైకి వస్తుండగా లారీ ఢీకొట్టడంతో రాజు అతడి భార్య తీవ్రంగా గాయపడ్డారు. కుమారుడు మల్లేశ్ అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. భార్యాభర్తల పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. మల్లేశ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మల్లేశ్ హైదరాబాద్లో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మల్లేశ్ తల్లిదండ్రులు కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సీత్లా పండుగకు వస్తుండగా ప్రమాదం జరగడంతో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.
కొడుకు కడ చూపు నోచుకోని తల్లిదండ్రులు..
రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి చెందగా తల్లిదండ్రులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో హైదరాబాద్లో చికిత్స పొందుతుండగా మల్లేశ్ భౌతికకాయానికి తం డాకు చెందిన వారి బాబాయ్లు ఉప సర్పంచ్ వాలి దేశ్యానాయక్, రవి అంత్యక్రియలు నిర్వహించారు. కొడుకు కడచూపునకు నోచుకోని పరిస్థితిలో తల్లిదండ్రులు దవాఖానలోనే ఉండిపోయారు.