గద్వాల, జూన్ 2 : రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణను ఆగం చేశారని.. కొట్లాడి సాధించుకున్న రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ నేతృత్వంలో అనతికాలంలోనే అద్భుతంగా అభివృద్ధి చేసుకొని దేశానికే ఆదర్శంగా ని లిచామని శాసనసభ ఉప సభాపతి పద్మారావుగౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం యావత్ ప్ర పంచం దృష్టిని ఆకర్శిస్తున్నదని పేర్కొన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పరేడ్ మైదానంలో జాతీయ జెండాను డిప్యూటీ స్పీకర్ ఎగురవేశారు. అంతకుముందు పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం స్మృతివనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్వరాష్ట్ర సాధనలో అరుమలైన వారిని స్మరించుకొని ఘనంగా నివాళులర్పించారు. పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తొమ్మిదేండ్ల్లలో సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించారు.
చేపట్టిన అభివృద్ధి వివరాలు..
రైతుబంధు పథకం ద్వారా జిల్లాలో 1,60,799 మందికి పది విడుతల్లో రూ.19,42కోట్ల 61లక్షలు అందించినట్లు తెలిపారు. రైతుబీమా ద్వారా జిల్లాలో 2,572 మందికి రూ.128కోట్ల 60లక్షలు, వ్యవసాయ యాంత్రీకరణ, వ్యవసాయ పనిముట్ల కింద రైతులకు సబ్సిడీతో రూ.12కోట్ల 79లక్షలు అందజేశామన్నారు. రుణమాఫీ కింద 90,047మందికి రూ.401కోట్ల 29లక్షలు మాఫీ, మిషన్ కాకతీయ ద్వారా 345 చెరువులను రూ.45కోట్లతో అభివృద్ధి చేయాలని నిర్ణయించగా, ఇప్పటివరకు 262 చెరువుల పనులు పూర్తి చేశామన్నారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ద్వారా ఆర్డీఎస్ చివరి ఆయకట్టుకు నీరు అందించేందుకు రూ.783కోట్లతో పరిపాలన అనుమతులతో పనులు చేపట్టామన్నారు. మొదటి దశలో రూ.159కోట్లతో పనులు పూర్తి చేశామన్నారు. గట్టు ఎత్తిపోతల పథకం ద్వారా కరువు పీడిత ప్రాంతాలైన గట్టు, కేటీదొడ్డి, ధరూర్ మండలాల్లో 33వేల ఎకరాలకు సాగునీరు అందించడానికి ప్రభుత్వం రూ.581కోట్లకు పరిపాలన అనుమతి ఇవ్వగా, పనులు చేపడుతున్నట్లు తెలిపారు. మిషన్ భగీరథ పథకం కింద జిల్లాలో 319 గ్రామాలకు నీరు అందించడానికి 347 ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు ఏర్పాటు చేసి 1,41,529 గృహాలకు నల్లా కనెక్షన్ ఇచ్చామని అన్నారు. మూడేండ్లలో వివిధ పథకాలకు రూ.10కోట్ల్లు ఖర్చు చేసి మత్స్యకారులకు చేయూతనిచ్చామన్నారు. కంటివెలుగు ద్వారా రెండో విడుతలో ఇప్పటివరకు 2,63,320 మందికి కంటి పరీక్షలు చేసి వారిలో 31,320మందికి రీడింగ్ అద్దాలు అందజేశామన్నారు. 9,792మంది గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లు అందజేసినట్లు తెలిపారు. మన ఊరు-మనబడి కింద జిల్లాలో 161 పాఠశాలను అభివృద్ధి, కల్యాణలక్ష్మి పథకం ద్వారా 18,558 మందికి రూ.117కోట్ల 91లక్షలు మంజూరు చేశామని, షాదీ ముబారక్ కింద 2,164 మందికి రూ.19కోట్ల 92లక్షలు మంజూరు చేశామన్నారు. జిల్లా కేంద్రంలో ప్రజల సౌకర్యార్థం రూ.12కోట్లతో ఆధునిక సౌకర్యాలతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం, 1,432 చేనేత కార్మికులకు సంబంధించి రూ.3కోట్ల 83లక్షల రుణాలు ప్రభుత్వం మాఫీ చేసిందని చెప్పారు.
స్టాల్స్ పరిశీలన..
పరేడ్మైదాన ఆవరణలో ఏర్పాటు చేసిన స్టాల్స్ను శాసనసభ ఉప సభాపతి పద్మారావుగౌడ్ పరిశీలించారు. చేనేత స్టాల్స్లో ఉపసభాపతి చీరలు కొనుగోలు చేశారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధుల కు టుంబాలను సన్మానించారు. బాలభవన్, ప్రగతివిద్యానికేతన్ పాఠశాల విద్యార్థుల నృత్యాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి, సీఎం కప్ క్రీడల్లో రాష్ట్రస్థాయిలో గెలుపొందిన క్రీడాకారులను అభినందించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ సరిత, కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎస్పీ సృజన, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, అబ్రహం, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, అదనపు కలెక్టర్ అపూర్వచౌహాన్, ఆర్డీవో రాములు, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రామన్గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీధర్గౌడ్, జెడ్పీ వైస్ చైర్మన్ సరోజమ్మ, గట్టు తిమ్మప్ప, మాజీ పంచాయతీరాజ్ ట్రిబ్యునల్ చైర్మన్ బండారి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.