నాగర్కర్నూల్, అక్టోబర్ 20 : ఈసారి అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సాంకేతక తోడవడంతో జిల్లా అంతటా నిఘా నీడన జరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30న జరగనున్న ఎన్నికలకు జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి పకడ్బందీ చర్యలు చేపట్టారు. క్షణాల్లో సమాచారం అందుబాటులో ఉంచేందుకు, ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు యాప్లు, వెబ్సైట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఈ యాప్ పూర్తిగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఉపయోగపడుతుంది. సింగిల్ విండో సిస్టమ్ ద్వారా ఆన్లైన్ ప్రచార వాహనాలకు, మైకు, సభలు, సమావేశాలకు, తదితర పలు రకాల అనుమతులు పొందడానికి వీలుంటుంది. ఈ పోర్టర్లు వినియోగించుకొని అభ్యర్థులు తమ ఇంటి నుంచే అనుమతులు పొందవచ్చు. సంబంధిత నోడల్ అధికారి, సెక్షన్ అధికారులు, ఐటీ అధికారులు అందుబాటులో ఉంటారు. దరఖాస్తుదారు ఆన్లైన్లో పొందుపర్చిన పత్రాలను పరిశీలించి అన్ని సక్రమంగా ఉంటే అనుమతులిస్తారు.
కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఎన్నికల్లో పీడబ్ల్యూడీ (పర్సన్ విత్ డిజబిలిటీస్) యాప్ను దివ్యాంగుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. ఓటరు దరఖాస్తులు నింపేందుకు డోర్ స్టెప్ సౌకర్యం ఉంటుంది. వారికి కావాల్సిన వీల్చైర్ లాంటి సౌకర్యాల కోసం కోరవచ్చు. దృష్టిలోపం ఉన్న వారికి అభ్యర్థుల పేర్లను వినగలిగే అవకాశం, తదితర సేవలను పొందవచ్చు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి వయోవృద్ధులు, 40 శాతానికిపైగా వైకల్యం కలిగిన ఓటర్లు తమ ఇంటి వద్దే ఓటుహకు వినియోగించుకొనే అవకాశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది. అలాంటి వారు నామినేషన్ల నోటిఫికేషన్ జారీ అయిన ఐదు రోజుల్లోగా ఫారం-12డీ నింపి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి అందజేయాలి. సాధారణ పోలింగ్కు ఒకరోజు ముందే మొబైల్ వాహనంలో పోలింగ్ సిబ్బంది వృద్ధులు, దివ్యాంగుల ఇండ్లకు చేరుకొని ఓటు వేయిస్తారు. ఈ ఓటింగ్ ప్రక్రియ అంతటినీ వీడియోగ్రఫీ చేస్తారు. కాగా ఎన్నికల సంఘం నూతనంగా ప్రవేశపెడుతున్న ఈ విధానంతో పోలింగ్ బూత్ల వద్ద కలిగే ఇబ్బందుల నుంచి వృద్ధులు, దివ్యాంగులకు ఉపశమనం లభించనున్నది. జిల్లాలో 15,330 మంది దివ్యాంగ ఓటర్లు ఓటర్లు ఉండగా, 80 ఏండ్లకు పైబడ్డ సీనియర్ సిటిజన్స్ 8,139 మంది ఓటర్లు ఉన్నారు.
అసెంబ్లీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు నాగర్కర్నూల్ జిల్లా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంది. ఓటర్లకు స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించి. ప్రలోభాలను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా 5 చెక్పోస్టులు, 10 నిఘా బృందాలను రంగంలోకి దింపింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఆయా బృందాలు నీడలా అభ్యర్థులను, పార్టీలను వెంటాడనున్నాయి.
జిల్లా స్థాయి నోడల్ అధికారి పర్యవేక్షణలో ఎంసీసీ బృందాలు ముమ్మరంగా తనిఖీ చేస్తున్నాయి. ప్రతి మండలానికి, మున్సిపాలిటీ పరిధిలో ఒక మోడల్ కోడ్ కండక్ట్ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఒకో బృందంలో నలుగురు సభ్యులకు తగ్గకుండా ఉంటారు. ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్, కార్యదర్శులు, పోలీసులు, వీడియో గ్రాఫర్, ఇతర సిబ్బంది బృందంలో ఉన్నా రు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రచారాలు, వ్యయాలు, చెల్లింపులపై దృష్టి సారించారు. గొడవలు, అల్లర్లు జరిగిన వెంటనే పోలీస్ సిబ్బందిని అప్రమత్తం చేస్తారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల పరిధిలోని పోస్టర్లు, గోడ రాతలు తొలగించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే అభ్యర్థికి రూ.40 లక్షల కంటే ఎకువ వ్యయం మించరాదనే నిబంధనలు ఉన్నాయి. వాటికంటే మించి ఖర్చు చేసే అవకాశాలుండడంతో అభ్యర్థులపై నిఘా ఉంచేందుకు నియోజకవర్గానికో వ్యయ పరిశీలన బృందాన్ని ఏర్పాటు చేశారు. వ్యయ పరిశీలకుడి పర్యవేక్షణ ఉంటుంది. జిల్లా ఆడిటర్ వ్యయ నోడల్ అధికారిగా ఉన్నారు. అసిస్టెంట్ ఎక్స్పెండేచర్ అబ్జర్వర్ (ఏఈవో)తోపాటు మరో ఇద్దరితోఅకౌంటింగ్ బృందం ఉంటుంది. అభ్యర్థుల ఖర్చుల వివరాలు ఎప్పటికప్పుడు వ్యయ బృందం లెకిస్తారు.
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు రోజువారి దినపత్రికలు, టీవీ ఛానళ్లల్లో ఇచ్చే ప్రకటనలపై మీడియా సర్టిఫికెట్ అండ్ మానిటరింగ్ కమిటీ(ఎంసీఎంసీ) బృందం ద్వారా పర్యవేక్షిస్తారు. ఎంసీఎంసీ బృందంలో ఆరుగురు సభ్యుల బృందం ఉంటుంది. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ చైర్మన్గా ఉంటారు. పెయిడ్ న్యూస్, సోషల్ మీడియా ప్రచారాలపై నిరంతరం పర్యవేక్షించేందుకు జిల్లాస్థాయిలో ఎంసీఎంసీ మీడియా సర్టిఫికెషన్ సెంటర్ను ఏర్పాటు చేసి పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.
నియోజకవర్గానికి మూడు స్టాటిస్టిక్ సర్వేలైన్ బృందాలు(ఎస్ఎస్వో) ఏర్పాటు చేశారు. బృందంలో గెజిటెట్ అధికారి, పోలీసు, అటవీ, ఎక్సైజ్ వారు సభ్యులుగా ఉంటారు. పార్టీల అభ్యర్థుల సభలు, సమావేశాలపై నిఘా ఉంచుతారు. మద్యం, డబ్బు తరలింపు, ఇతరత్రా ప్రలోభాలకు సంబంధించిన వస్తువులపై నిఘా బృందం సభ్యులు గట్టి నిఘా పెడతారు.
ఓటర్లను అభ్యర్థులు ప్రలోభాలను గురిచేస్తే ఈ సీ-విజిల్ యా ప్ ద్వారా జిల్లా ఎన్నికల అధికారికి నేరుగా ఫిర్యాదు చేయవ చ్చు. ఎన్నికల సమయంలో అభ్యర్థులు, అనుచరగణం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా, అల్లర్లు, గొడవలు, డ బ్బు, మద్యం పంపిణీ చేసినా దీని ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు అందిన 100 నిమిషాల్లో అధికారులు చర్యలు తీసుకుంటారు. ఇప్పటివరకు జిల్లాలో 12 కేసులు సీ-విజిల్ ద్వారా నమోదు కాగా, ఆరు ఫిర్యాదులను పరిషరించారు. ఐదు ఫి ర్యాదులు ప్రజలు తమ అవగాహన కోసం వినియోగించిన సం బంధం లేని ఫిర్యాదులు అందాయి. ఒకటి ఫేక్ ఫిర్యాదు నమోదైంది. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల ఎన్నికల అధికారుల వెబ్సైట్లు ఈ ఫిర్యాదులు నమోదవుతాయి.
ఓటర్ల కోసం ఎన్నికల సంఘం ఓటరు హెల్ప్ లైన్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఓటు నమోదుకు ఇందులో నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఓటరు మార్పులు చేర్పులకు కూడా దరఖాస్తు అందుబాటులో ఉంది. పత్రాలు, వివరాలతో కూడిన దరఖాస్తును అప్లోడ్ చేస్తే ఈ ఆర్డర్కు చేరుతుంది. ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందో లేదో తనిఖీ చేసుకోవచ్చు. ఈ-ఎపిక్ కార్డును పొందవచ్చు. ఈ ప్రక్రియ అక్టోబర్ 30 వరకు కొనసాగనుంది. వీడియో వ్యూయింగ్ టీం, వీడియో సర్వే లైన్ టీమ్లతోపాటు ఇతర బృందాలు కూడా ఎన్నికల నిర్వహణలో భాగస్వామ్యం అవుతున్నాయి. కలెక్టరేట్లు 24/7 నిరంతరం 1950 టోల్ ఫ్రీ నంబర్ను అందుబాటులో ఉంచా రు. టోల్ ఫ్రీ నెంబర్కు వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు సంబంధిత బృందాలకు చేరవేస్తూ వచ్చే ఫిర్యాదులపై సత్వరం స్పందించేందుకు జిల్లాస్థాయి నోడల్ అధికారి పర్యవేక్షణ చేస్తున్నారు. అక్టోబర్ 19వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన 1950 కాల్ సెంటర్కు వచ్చిన 788 ఫోన్ కాల్స్ను వారి సందేహాలను నివృత్తి చేశారు.
ఎవరైనా బ్యాంకు ఖాతాలో ప్రతిరోజు రూ. లక్ష నగదు జమ, ఉపసంహరణ చేసినా,నెలలో రూ.10 లక్షలు పైబడి నగదు ఉపసంహరణ, ఇతరులకు ట్రాన్స్ఫర్ చేసినా ఖాతా వివరాలపై ప్రత్యేక దృష్టి సాధించారు. ఆన్లైన్ జరిగే లావాదేవీలపై గట్టి ని ఘా ఉంచారు. బ్యాంకర్లు ఎన్నికల సంఘం నిబంధనల మేరకు వ్యవహరించాలని, ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దని బ్యాంకర్లకు ఇదివరకే జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాలు ఇచ్చారు.
ఎన్నికల నియామవళి అమల్లోకి వచ్చి న వెంటనే నిబంధనలన్నింటినీ కఠినంగా అమలు చేస్తున్నాం. మాడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనలను అనుగుణం గా వ్యవహరిస్తూ, ఎప్పటికప్పు డు ఎన్నికల యంత్రాంగం అ ప్రమత్తంగా ఉంటూనే రాజకీయ పార్టీ లు, ఓటర్లలో నమ్మకాన్ని పెంచేవిధంగా జిల్లా లో ఎన్నికల నిబంధనలు అమలు చేస్తున్నాం. ఎన్నికలను ప్రజలు స్వేచ్ఛ గా, శాంతియుతంగా, ప్రశాంత వాతావరణంలో ఓటు హ కును వినియోగించుకునేలా ఏర్పాట్లు కల్పిస్తున్నాం.అన్ని రకాల వ్యవస్థలు పకడ్బందీగా పనిచేసేలా నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తాం.