వనపర్తి, ఏప్రిల్ 7 : వనపర్తి జిల్లాలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతున్నది. అన్ని ప్రాం తాల్లో సాధారణం కన్నా 2నుంచి 3 డిగ్రీలు అదనంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉద యం 7నుంచి సాయంత్రం 6 గంటల వరకు భానుడి తాపం కొనసాగుతుంది. దీంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మారిన ఉష్ణోగ్రతల నేపథ్యంలో రోజురోజుకూ వేడితోపాటు ఉక్కపోత పెరుగుతున్నది. జిల్లాలో 44 డిగ్రీలు దాటింది. ఈ క్రమంలో కొత్తకోటలో 44.3 డిగ్రీలు రికా ర్డు స్థాయిలో నమోదు కాగా పెబ్బేరులో 44.1, వీపనగండ్లలో 41.8, ఆత్మకూర్లో 42.5, పానగల్లో 42.4, గోపాల్ పేటలో 42.1, శ్రీరంగపురంలో 42.1,
అమరచింతలో 42.0, ఖిల్లాఘణపురంలో 41.9, పెద్దమందడిలో 41.8, రే వల్లిలో 40.7, వనపర్తిలో 40.7, చిన్నంబావిలో 43.2, మదనాపురంలో 42.1డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏప్రిల్ ప్రారంభంలోనే ఇలా ఉంటే మే నాటికి పరిస్థితి మరింత తీవ్రమ య్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నది. పగటిపూట ఉష్ణోగ్రతలు ఎండ, వడగాలి, ఉక్కపోత ఉండగా , రాత్రి సమయానికి చల్లబడుతున్నది. వాతావరణంలో భిన్నమైన ప రిస్థితులు నెలకొనడంతో ప్రజారోగ్యం పై ప్రభా వం చూపే ప్రమాదం ఉంటుందని వైద్యాధికారులు సూచిస్తున్నారు.