ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగుతో దృష్టి లోపాలు దూరమవుతున్నాయి. జనవరి 19న కార్యక్రమం ప్రారంభమవగా.. రెండు నెలలుగా ‘కంటి’న్యూగా సాగుతున్నది. యువత మొదలు వృద్ధుల వరకు పరీక్షలు చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. దీంతో ప్రజలు తరలివస్తుండడంతో శిబిరాలకు అనూహ్య స్పందన లభిస్తున్నది. ఉచితంగా నేత్ర పరీక్షలతోపాటు కండ్లద్దాలు పంపిణీ చేస్తున్నారు. అవసరమైన వారికి ఉచితంగా శస్త్రచికిత్సలు చేయించేలా ఏర్పాట్లు చేశారు.
నారాయణపేట జిల్లా వ్యాప్తంగా 280 గ్రామాలు, 56 మున్సిపల్ వార్డుల్లో 2,26,571 మందికి పరీక్షలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే 150పైగా పల్లెల్లో, 23 బల్దియా వార్డుల్లో 1,61,172 మందికి నేత్ర పరీక్షలు చేశారు. వీరిలో 20,976 మందికి అద్దాలు, 16,172 మందికి రీడింగ్, 4,804 మందికి ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ పంపిణీ చేశారు. పేషెంట్ పేరు, ఆధార్కార్డు, ఊరి పేరుతో ప్రత్యేకంగా రూపొందించిన బార్కోడ్తో పంపిణీ ప్రక్రియ చేపడుతున్నారు. దీంతో మస్క బారిన కండ్లు తేజోమయం అవుతున్నాయి. సీఎం కేసీఆర్ ప్రారంభించిన కార్యక్రమం బాగుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
– నారాయణపేట, మార్చి 23
నారాయణపేట, మార్చి 23 : కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్య సేవలందించేందుకు ప్రభు త్వం కంటివెలుగు పథకానికి శ్రీకారం చుట్టింది. మొదటి విడుత విజయవం తం కావడంతో ఈ ఏడాది జనవరి 19వ తేదీన రెండో విడుతను ప్రారంభించింది. ఈ పథకం కింద ఉచితంగా కంటి పరీక్షలను నిర్వహించి రీడింగ్, ప్రిస్క్రిప్షన్ అనే రెండు రకాల కళ్లద్దాలను అందజేస్తున్నది. కంటి వెలుగు శిబిరా లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గ్రామాలు, పట్టణాల్లో నిర్వహిస్తున్న శిబిరాల్లో ఒక మెడికల్ ఆఫీసర్, ఆప్టిమెట్రిస్ట్, ఏఎన్ఎం, సూపర్వైజర్, ఆశవర్కర్లతో కూడిన ఎనిమిది నుంచి 10 మంది బృందం సేవలందిస్తున్నారు.
నారాయణపేట జిల్లాలో 24 బృందాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం కోసం 48 మందిని కొత్తగా రిక్రూట్ చేశారు. జిల్లాలోని 280 గ్రామాలు, 56 మున్సిపల్ వార్డుల్లో 2,26,571 మందికి కంటి పరీక్షలు చేయాలని ల క్ష్యంగా పెట్టుకున్నారు. శిబిరాలకు వెళ్లేందుకు ప్రజల కోసం ప్రత్యేకంగా వాహన సదుపాయాలను సైతం ఏర్పాటు చేశారు.
కంటివెలుగు సిబ్బందికి పని ఒత్తిడి ఉండడంతో వారంలో ఐదు రోజుల పనిదినాలు మాత్రమే నిర్ణయించారు. శని, ఆదివారం పరీక్షలకు సెలవుఇచ్చారు. ఇప్పటివరకు జిల్లాలోని 150 పైగా గ్రామాలు, 23 మున్సిపల్ వా ర్డుల్లో 1,22,528 మందికి కంటి పరీక్షలు నిర్వహించి, 20,976 మందికి అద్దాలను పంపిణీ చేశారు. ఇందులో 16,172 మందికి రీడింగ్ గ్లాసెస్ అందజేశారు. ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ అవసరం ఉ న్నట్లు 9,849 మందిని గుర్తించి, 4,804 మందికి అద్దాలను పంపిణీ చే శారు. మిగతా వారికి త్వరలోనే అందజేయనున్నారు. శిబిరానికి వచ్చిన వారి పేరు, గ్రామం, ఆధార్కార్డుతో ప్రత్యేకం గా రూపొందించిన బార్కోడ్తో కూడిన అద్దాలను పంపిణీ చేస్తుండడంతో ఎలాంటి తారుమారయ్యే అవకాశాలు లేవు. ప్రభుత్వమే ఉచితంగా పరీక్షలు చేసి అద్దాలు ఇస్తుండడంతో ప్రజలు సం తోషం వ్యక్తం చేస్తున్నారు.