మహబూబ్నగర్టౌన్/మరిక ల్, మార్చి 13 : బీహార్ రాష్ట్రంలో జరుగనున్న జాతీయస్థాయి సబ్ జూనియర్ కబడ్డీ టోర్నీలో పాల్గొ నే తెలంగాణ బాలుర జట్టుకు మ హబూబ్నగర్ జిల్లాకు చెందిన పాండూనాయక్, నారాయణపేట జిల్లా మాగనూర్ మండలంలోని నేరేడుగం గ్రామానికి చెందిన వి ద్యార్థి గోవిందు ఎంపికయ్యారు.
సూర్యాపేటలో జరిగిన రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నీలో జిల్లా జట్టు తరఫున చక్కటి ప్రతిభ కనబరిచి రాష్ట్ర జట్టుకు సెలక్ట్ అయ్యా రు. దీంతో కబడ్డీ సం ఘం మహబూబ్నగర్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శాంతికుమార్, కురుమూర్తిగౌడ్, కబడ్డీ అసోసియేషన్ నారాయణపేట జిల్లా ప్రధా న కార్యదర్శి తిరుపతిరె డ్డి, నాయకులు తిరుపతిరెడ్డి, బాలరాజు, వెంకటప్ప, శ్రీకాంత్రెడ్డి.. పాం డూనాయక్, గోవిందును అభినందించారు.