నారాయణపేట, డిసెంబర్ 25 : ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు జాతీ య సమైక్యతకు కృషి చేస్తున్నారని దక్షణ మధ్య క్షేత్ర ధర్మజాగరణ ప్రము ఖ్ అమర లింగన్న అన్నారు. పట్టణంలోని సింగార్భేస్ సరస్వతి శిశు మం దిర్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం సాయంత్రం రాష్ట్రీయ స్వ యం సేవక్ సంఘ్ నగర సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి ము ఖ్య వక్తగా హాజరైన ఆయన మాట్లాడుతూ హిందూ బంధువుల అనైక్యత కారణంగా దేశ స్వాతంత్య్రం పోగొట్టుకొని బానిస రాజ్యంగా మార్చుకున్నామన్నారు. దీనిని గ్రహించిన డాక్టర్ హెగ్డేవార్ ఆర్ఎస్ఎస్ సంఘాన్ని స్థాపించి హిందూ సమైక్యతకు శాఖ అనే దివ్యమైన ఔషధాన్ని ఇచ్చినట్లు పేర్కొన్నారు.
ఈ ఔషధంతో దేశాన్ని పూర్వ వైభవ స్థితికి తీసుకురావడానికి స్వయం సేవకులు అహర్నిశలు కృషి చేస్తున్నట్లు చెప్పారు. జాతీయ సమైక్యతకు, దేశ పూర్వవైభవ స్థితి కోసం ఆర్ఎస్ఎస్ కృషి చేస్తుంటే వారికి సహకరించకుండా కొంతమంది రాజకీయ నాయకులు, సెక్యులరిస్టులు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన తెలిపారు. విషయాన్ని హిందువులందరూ ఏకమై తిప్పి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. హిందూ అమ్మాయిలు లవ్ జిహాద్కు గురికాకుండా కాపాడుకోవాలన్నారు. ముఖ్యఅతిథి పురపాలక ఉద్యోగి హనుమంతు మాట్లాడుతూ హిందూ ధర్మరక్షణకు ప్రతిఒక్కరూ కంకణబద్ధులు కావాలని కోరారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ నగర కార్యవాహ వెంకట్రాములు, ప్రభాకర్, స్వయం సేవకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.