మహబూబ్నగర్టౌన్, డిసెంబర్ 21 : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో గురువారం నిర్వహిం చిన రాష్ట్రస్థాయి నెట్బాల్ టోర్నీలో ఉమ్మడి మహబూబ్నగర్ అండర్-14 బాలుర జట్టు చాంపియన్గా నిలువగా, అండర్-17 బాలుర జట్టు రన్నర్గా నిలిచింది. జిల్లా జట్టు విజేతగా నిలువడంపై ఎస్జీఎఫ్ సెక్రటరీ రమేశ్బాబుతోపాటు క్రీడాకారులు, క్రీడాభిమానులు అభినందించారు.