వీసీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి
మహబూబ్నగర్, జనవరి 21 : ప్రభుత్వం చేపట్టిన కంటివెలుగు కార్యక్రమంపై పర్యవేక్షణ పెంచాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి అన్నా రు. హైదరాబాద్ నుంచి శనివారం నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్లో కలెక్టర్ ఎస్.వెంకట్రావుతో మాట్లాడారు. కంటివెలుగుకు సంబంధించిన ఎంఐఎస్ నివేదికలను ఎప్పటికప్పుడు పంపాలని సూచించారు. క్వాలిటీ కంట్రోల్ బృందాలు అన్ని శిబిరాలను సందర్శించేలా చూడాలన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేవిధంగా ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. జిల్లాలో ఉన్న బఫర్ టీంలు ప్రత్యేక వర్గాలకు అవసరమైన శిబిరాలను ఏర్పాటు చేసి కంటి పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. కండ్లద్దాల పంపిణీని పకడ్బందీగా చేపట్టాలని, అద్దాలు అవసరమైతే సమాచా రం అందించాలని తెలిపారు. వీసీలో అదనపు కలెక్టర్ సీతారామారావు, డీఎంహెచ్వో కృష్ణ, డిప్యూటీ డీఎంహెచ్వో భాస్కర్నాయక్, ప్రాజెక్టు ఆఫీసర్ వినోద్రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు ప్రదీప్కుమార్, నూరూల్ నజీ బ్, మహమూద్ షేక్, పశుసంవర్ధక శాఖ జిల్లా అధికా రి మధుసూదన్గౌడ్, డీపీవో వెంకటేశ్వర్లు ఉన్నారు.
భూత్పూర్, జనవరి 21 : కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్గౌడ్, డీఎంహెచ్వో కృష్ణ, డిప్యూటీ డీఎంహెచ్వో భాస్కర్నాయక్ కోరారు. మున్సిపాలిటీలోని రెండోవార్డు శేరిపల్లిలో కంటివెలు గు శిబిరాన్ని ప్రారంభించారు. వైద్యసిబ్బంది 216 మందికి పరీక్షలు నిర్వహించి 50మందికి కండ్లద్దాలను అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్ రబ్బు, సీహెచ్వో రామయ్య, కౌన్సిలర్లు వసంతాగోపాల్, శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎంపీపీ చంద్రమౌళి, బీఆర్ఎస్ నాయకులు సత్తూర్ నారాయణగౌడ్, గోప్లాపూర్ సత్యనారాయణ, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
నవాబ్పేట, జనవరి 21 : అంధత్వ నివారణే ప్రభు త్వ లక్ష్యమని ఎంపీవో భద్రూనాయక్ అన్నారు. మం డలంలోని లింగన్నపల్లిలో శనివారం రెండోవిడుత కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సం దర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కం టివెలుగు శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. లింగన్నపల్లిలో 207మందికి పరీక్షలు నిర్వహించి 23మందికి కండ్లద్దాలు అందజేశారు. 12మందికి కంటి అద్దాల కోసం ఆర్డర్ చేశారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి విజయలక్ష్మి, సర్పంచ్ నర్సమ్మ, ఎంపీటీసీ బ్రహ్మానందరెడ్డి, యాదగిరి, పంచాయతీకార్యదర్శి వెన్నెల తదితరులు పాల్గొన్నారు.