మహబూబ్నగర్టౌన్, మే 6 : ఇంటర్మీడియట్ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లావ్యాప్తంగా 32 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించారు. మొత్తం 11,104మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా, 10,583మంది విద్యార్థులు హాజరయ్యారు. జనరల్ ఇంటర్లో 8,835మంది, ఒకేషనల్లో 1,748మంది విద్యార్థులు పరీక్ష రాశారు. 521మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. 3 సిట్టింగ్స్క్యాడ్, రెండు ప్లయింగ్ స్క్యాడ్ బృందాలతోపాటు 32మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 32మంది డిపార్ట్మెంట్ అధికారులు పరీక్షను పర్యవేక్షించినట్లు డీఐఈవో వెంకటేశ్వర్లు తెలిపారు.
జడ్చర్ల పట్టణంలో..
జడ్చర్లటౌన్, మే 6 : పట్టణంలోని ఐదు పరీక్షా కేంద్రాల్లో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షను 1304మంది విద్యార్థులు రాశారు. కోఎడ్యుకేషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 263మంది విద్యార్థులకుగానూ 249మంది, బాలికల కళాశాలలో 248 మందికిగానూ 240మంది, విశ్వవికాస్ కళాశాలలో 264మందికిగానూ 256మం ది, వీఎస్ఆర్ కళాశాలలో 222మందికిగానూ 206మంది, వైష్ణవి క ళాశాలలో 396మందికిగానూ 353మంది విద్యార్థులు హాజరయ్యా రు. పరీక్షకు 89మంది గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు.
మిడ్జిల్ మండలంలో..
మిడ్జిల్, మే 6 : మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం పరీక్ష ప్రశాంతంగా కొనసాగింది. మొ త్తం 229మందికిగానూ 201మంది పరీక్షకు హాజరయ్యారు. 18మంది గైర్హాజరైనట్లు ప్రిన్సిపాల్ వెంకటయ్య తెలిపారు.
బాలానగర్ మండలంలో..
బాలానగర్, మే 6 : మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం పరీక్ష ప్రశాంతంగా కొనసాగినట్లు అధ్యాపకులు తెలిపారు. 474మంది విద్యార్థులకుగానూ పరీక్షకు 25 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. అలాగే ఒకేషనల్ పరీక్షకు 38మం ది హాజరుకావాల్సి ఉండగా, 7మంది గైర్హాజరైనట్లు తెలిపారు.