పాలమూరు, నవంబర్ 14 : కాంగ్రెస్కు ఓటు వేస్తే కష్టాలు తప్పవని, ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ రూరల్ మండలం బొక్కలోనిపల్లి, తెలుగుగూడెం, జమిస్తాపూర్ గ్రామాల్లో ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రికి గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. యువజన సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో ప్రజలకు కన్నీళ్లే మిగిలాయన్నారు. కరెంటు, సాగునీరు, ఉపాధి ఇలా అన్ని విధాలుగా అన్యాయం చేసి ప్రజలు గోసపడేలా చేశారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పదేండ్లలోనే 55 ఏండ్ల అభివృద్ధి చేశామన్నారు. అనంతరం మార్గమధ్యలో తెలుగుగూడెం వ్యవసాయ క్షేత్రంలో రైతులతో మంత్రి ముచ్చటించారు. కూలీలతో కలిసి కలుపు తీశారు. ఈ సందర్భంగా కూలీలు మంత్రితో మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రైతులను ఆదుకున్న బీఆర్ఎస్ పార్టీకి మరోసారి ఓటువేసి అండగా నిలవాలని మంత్రి కోరారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా సాగునీటిని అందిస్తామని మంత్రి తెలిపారు. తెలంగాణలో అమలువుతున్న సంక్షేమ పథకాలు దేశంలోని ఇతర రాష్ర్టాల్లో ఎక్కడా లేవన్నారు. అన్నిరంగాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. తాగునీటి కష్టాలు తీర్చామని, మహబూబ్నగర్ను ఊహించని విధంగా తక్కువ సమయంలోనే అభివృద్ధి చేశామన్నారు. అభివృద్ధి కొసాగాలంటే కారుగుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు.
మహబూబ్నగర్ రూరల్ మండలం జమిస్తాపూర్లో మంత్రి శ్రీనివాస్గౌడ్ సమక్షంలో గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు జి.రాంచందయ్య, రఘు, రమేశ్ తదితర నాయకులు బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పి.చంద్రశేఖర్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, జెడ్పీటీసీ వెంకటేశ్వరమ్మ, ఎంపీపీ సుధాశ్రీ, వైస్ ఎంపీపీ అనిత, ముడా డైరెక్టర్ ఆంజనేయులు, సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు శ్రీకాంత్గౌడ్, పీఏసీసీఎస్ చైర్మన్ రాజేశ్వర్రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గిరిధర్రెడ్డి, జేపీఎన్సీ కళాశాల చైర్మన్ రవికుమార్, సర్పంచ్ యుగేందర్రెడ్డి, రాంచంద్రయ్య, మమత, ఉపసర్పంచ్ మొగులయ్య, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్నగర్ టౌన్, నవంబర్ 14 : కాంగ్రెస్ వస్తే మూడు గంటల కరెంట్, బీఆర్ఎస్ వస్తే మూడు పంటలని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మంగళవారం 42వ వార్డు అంబేద్కర్నగర్, జగ్జీవన్నగర్, వేపూరిగేరి, 49వ వార్డు సుభాశ్నగర్, వడ్డెరబస్తీలో మంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంత్రికి ప్రజలు పూల వర్షం కురిపించి ఘనస్వాగతం పలికారు. అనంతరం హౌసింగ్బోర్డు కాలనీలో ఎన్నిలక ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పి.చంద్రశేఖర్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, డీసీసీబీ ఇన్చార్జి చైర్మన్ కోరమోని వెంకటయ్య, బీఆర్ఎస్ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు కృష్ణమోహన్, కౌన్సిలర్లు పు ష్పావతి, రామ్లక్ష్మణ్, యాదమ్మ, వనజ పాల్గొన్నారు.