శ్రీశైలం, ఫిబ్రవరి 15 : శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఐదోరోజైన బుధవారం భ్రమరాంబమల్లికార్జున స్వామి, అ మ్మవార్లకు మృత్యుంజయ, రుద్ర, చండీపారాయణాలు, పూ జలు నిర్వహించారు. సాయంత్రం భ్రామరీ సమేతుడైన మల్లికార్జునుడు రావణ వాహనంపై ఉరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. కళాకారుల డప్పుచప్పుళ్ల మధ్య గ్రామోత్సవాన్ని శో భాయమానంగా నిర్వహించారు. గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు, అక్కడి నుంచి బయలువీరభధ్ర స్వామి వరకు ఆధ్యంతం నయనానందకరంగా సాగింది. ఉత్సవ అనంతరం కాళరాత్రిపూజ మంత్రపుష్పంతోపాటు స్వామి, అమ్మవార్లకు ఆస్థానసేవ చేపట్టారు.
ఉభయ దేవాలయాల్లో షోడశోపచార పూజలు చేసి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసినట్లు ఈవో లవన్న తెలిపారు. కాగా, స్వామి, అమ్మవార్లకు ఏపీ ప్రభుత్వం తరఫున పట్టువస్ర్తాలు సమర్పించారు. ఆలయ ప్రధాన గోపురం వద్దకు వచ్చిన ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, ధర్మకర్తల మండలి చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డికి అర్చకులు స్వాగతం పలికారు. ఉభయ ఆలయాలను దర్శించుకొని పట్టువస్ర్తాలు సమర్పించారు. ఆలయ మాఢవీధిలోని భ్రామరీ కళావేదికతోపాటు పుష్కరిణి, శివదీక్షా శిబిరాల వద్ద కూచుపూడి, భరతనాట్యం, హరికథ, బుర్రకథ, భక్తరంజని, నాటికలను అర్ధరాత్రి వరకు నిర్వహించినట్లు పీఆర్వో శ్రీనివాసరావు తెలిపారు.