పాలమూరు, ఫిబ్రవరి 14 : మహబూబ్నగర్ తొలిదశ ఉద్యమకారుడు, ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చిన మం త్రి తండ్రి దివంగత నారాయణగౌడ్ ద్వితీ య వర్ధంతిలో శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నా రు. కుటుంబ సభ్యులతో కలిసి తండ్రి సమాధి వద్ద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమం లో కుటుంబ సభ్యులు, బంధుమిత్రు లు, అభిమానులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని నివాళులర్పించారు. ఆయన పవిత్ర ఆత్మకు శాం తి చేకురాలని ప్రార్థించారు.
చిన్నారెడ్డి సేవలు విలువైనవి
సామాజిక కార్యక్రమాలతో ఎందరి కో సేవ చేసిన దివంగత చిన్నారెడ్డి స్ఫూ ర్తివంతంగా నిలిచారని క్రీడా శాఖ మం త్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. రెడ్డి సే వా సమితి ఉమ్మడి జిల్లా గౌరవ అధ్యక్షుడు వేపూరి చిన్నారెడ్డి దశదిన కర్మ సందర్భంగా జిల్లా కేంద్రంలోని బండమీదిప ల్లి రాజాబహద్దూర్ రెడ్డి కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. చిన్నారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను స్మరించా రు.
రెడ్డి హాస్టల్తో కేవలం రెడ్డి సామాజిక వర్గానికి మాత్రమే కాకుండా ఎం దరో పేద విద్యార్థులు విద్యనభ్యసించేందుకు ఆయన ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. కుల, మతాలకతీతంగా పేదలందరికీ సేవ చేయడం గొప్ప విషయమన్నారు. చిన్నారెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయన్ను స్మరించుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. రెడ్డి హా స్టల్కు అసంపూర్తిగా ఉన్న రోడ్డును పూర్తి చేస్తామన్నారు. మంత్రి వెంట ఎం పీ మన్నె శ్రీనివాస్రెడ్డి, మున్సిపల్ చై ర్మన్ నర్సింహులు, వైస్ చైర్మన్ గణేశ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గిరిధర్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్రెడ్డి, చిన్నారెడ్డి కుటుంబ సభ్యులు ఉన్నారు.