మిడ్జిల్, జనవరి 14 : క్రీడాకారులు స్నేహభావంతో మెలగాలని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సూచించారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని మిడ్జిల్ మండలం కొత్తూర్లో ఏర్పాటు చేసిన కేపీఎల్ క్రికెట్ టోర్నీని శనివారం ప్రా రంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడల్లో రాణిం చే యువతకు బంగారు భవిష్యత్తు ఉంటుందన్నారు. గ్రామీ ణ క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. ఇందుకోసం అన్ని గ్రామాల్లో క్రీడాప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నదన్నారు. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించాలని సూచించారు. కొత్తూర్లో స్టేడియం నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని, అవసరమైన స్థలం సేకరించాలని అధికారులకు సూ చించారు. అనంతరం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని టోర్నీ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు జంగారెడ్డి, నాయకులు సుధాబాల్రెడ్డి, శ్యామల్రెడ్డి, ప్రతాప్రెడ్డి, బాలు, రామ్మోహన్, కృష్ణయ్య, సత్యంగుప్తా, జంగయ్య, రాజశేఖర్రెడ్డి, కృష్ణారె డ్డి, మల్లేశ్, గంగాధర్, బంగారు, వెంకటయ్య పాల్గొన్నారు.
గండీడ్, జనవరి 14 : క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కల్గిస్తాయని వైస్ఎంపీపీ ఈశ్వరయ్యగౌడ్ అన్నారు. మండలంలోని పెద్దవార్వల్లో శనివారం పీపీఎల్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో ప్రీమియర్ లీగ్-6 క్రికెట్ టోర్నీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడలతో స్నేహభావం, శారీరక దారుఢ్యం పెంపొందుతుందని తెలిపారు. యువత క్రీడ ల్లో రాణించి మంచిపేరు తెచ్చుకోవాలని సూచించారు. కా ర్యక్రమంలో సర్పంచ్ లలిత, నాయకులు నర్సింహారావు, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.
బాలానగర్, జనవరి 14 : మండలంలోని డేగావత్తండాలో జీపీఎల్ క్రికెట్ టోర్నీని శనివారం సింగిల్విండో డైరెక్టర్ మంజూనాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. గ్రామీణ క్రీడాకారులు రాష్ట్ర, జాతీయస్థాయి క్రీడాపోటీల్లో రాణించి మంచిపేరు తెచ్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ లలిత తదితరులు పాల్గొన్నారు.