మహబూబ్నగర్టౌన్/పాలమూరు, డిసెంబర్ 11: మహబూబ్నగర్లో వాలీబాల్ అకాడమీ ఏర్పాటు చేశామని, ఫుట్బాల్ అకాడమీ ఏర్పాటుకు కృషిచేస్తానని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. స్థానిక బాలుర కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న పీర్ హషీం ఫుట్బాల్ టోర్నమెంట్కు మంత్రి హాజరై ప్రారంభించి మాట్లాడారు. గతంలో బాలుర కళాశాల మైదానంలో కనీసం గ్రౌండ్ కూడా ఉండేదికాదని, అలాంటిది స్టేడియం ఏర్పాటు చేశామన్నారు. ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో కూడా స్టేడియం నిర్మించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని గ్రామాల్లో క్రీడాప్రాంగణాలు నిర్మించామని, ఇప్పటివరకు 7600గ్రామాల్లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్రస్థాయి క్రీడలకు పాలమూరు వేదికగా మారిందన్నారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయస్థాయి టోర్నీలకు వెళ్లే క్రీడాకారులకు తనవంతు సహకారం అందిస్తామని మంత్రి తెలిపారు. అనంతరం నసరుల్లాబాద్ జెడ్పీహెచ్ఎస్, రాజాపూర్ జెడ్పీహెచ్ఎస్ జట్ల మధ్య మ్యాచ్ను ప్రారంభించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ షబ్బీర్, నాయకులు షఫీ, ముంజిమిల్, జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్నగర్ మండలం రాంచంద్రపురంలోని కాళికాదేవి ఉత్సవాల్లో ఆదివారం ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా సిడెకు పూజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, కోటకదిర పీఏసీసీఎస్ చైర్మ న్ రాజేశ్వర్రెడ్డి, సహాయ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శివప్రసాద్యాదవ్, భక్తులు పాల్గొన్నారు.
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, డిసెంబర్ 11: భజరంగ్దళ్ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ బ్రెయిన్స్ట్రోక్తో జిల్లాకేం ద్రంలోని ఓ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆదివారం దవాఖానకు వెళ్లి పరామర్శించారు. వైద్యం కోసం రూ.లక్ష ఆర్థికసాయం చేశారు. మెరుగైన వైద్యం అందించి శ్రీకాంత్ వెంటనే కోలుకునేలా చూడాలని వైద్యులను కోరారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా వెంటనే స్పందించే మంత్రి తమకు అండగా ఉండడం తమ అదృష్టమని స్థానికులు పేర్కొంటున్నారు.