పాలమూరు, ఫిబ్రవరి 14 : జిల్లా కేంద్రంలోని పాలమూరు విశ్వవిద్యాలయంలో బుధవారం వసంత పంచమి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వ హించారు. ఈ సందర్భంగా మైసమ్మ ఆలయంలో వీసీ లక్ష్మీకాంత్రాథోడ్ ప్రత్యేక పూజ లు చేశారు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సా ధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పీజీ ప్రిన్సిపాల్ చంద్రకిరణ్, అధ్యాపకురాలు సంధ్యారాణి, ఒప్పంద అధ్యాపకుల సంఘ నాయకులు అర్జున్కుమార్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్నగర్ పట్టణంలోని ఎన్టీఆర్ మహి ళా డిగ్రీ కళాశాలలో బుధవారం వసంత పంచ మి వేడుకలు నిర్వహించారు. ఈ సంద ర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ విజయ్కుమార్ ఆధ్వర్యంలో సరస్వతీ మాత చిత్రపటానికి పూజలు చేశారు. అనంతరం ప్రిన్సిపాల్ విద్యార్థులకు వసంతపంచమి విశిష్టతను వివరించారు. కార్యక్రమంలో అధ్యాపకులు పాల్గొన్నారు.
దేవరకద్ర, ఫిబ్రవరి 14: మండల కేంద్రంలోని శ్రీవాణి శిశుమందిర్, డోకూర్ గ్రామాంలోని తపోవన్ ఉన్నత పాఠశాలలో బుధవారం వ సంత పంచామి వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా సరస్వతీదేవి చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేసి చిన్నారులకు సా మూహిక అక్షరాభ్యసం చేయించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ నిరంజన్ రెడ్డి, నాగేశ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
భూత్పూర్, ఫిబ్రవరి14: అమిస్తాపూర్ గ్రామ శివారులోని జ్ఞాన సరస్వతిదేవి ఆలయంలో వ సంత పంచమని పురస్కరించుకొని అర్చకుడు రవిశంకర్ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారి సన్నిధిలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించా రు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, తల్లి దండ్రులు తదితరులు పాల్గొన్నారు.
నారాయణపేట, ఫిబ్రవరి 14 : పట్టణంలో వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సింగార్బేస్లోని సరస్వతీ శిశుమందిర్ ఉన్నత పాఠశాలలో అక్షరాభ్యాసం చేయించారు. అంతకుముందు సరస్వతీ మాతకు పూజలు చేసి గాయత్రీ మహాయజ్ఞం నిర్వహించారు. మండలంలోని శేర్నపల్లి, దామరగిద్ద మండలంలోని వత్తుగుండ్ల శిశుమందిర్ పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. అదేవిధంగా పట్టణంలోని శక్తిపీఠంలో చిన్నారులచే సామూహిక అక్షరాభ్యాసం చే యించారు. కార్యక్రమంలో సరస్వతి విద్యాపీ ఠం జిల్లా గౌరవ అధ్యక్షుడు రతంగపాండురెడ్డి, విభాగ్ కార్యదర్శి ఎల్లప్ప, విభాగ్ విద్వత్ పరిషత్ కన్వీనర్ లక్ష్మయ్యగౌడ్, జిల్లా అధ్యక్షుడు బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
నారాయణపేట టౌన్, ఫిబ్రవరి 14 : పట్టణంలోని బాలకేంద్రంలో ఎస్పీ బాలు అభిమాన సంఘం ఆధ్వర్యంలో వసంత పంచమిని ఘ నంగా నిర్వహించారు. మున్సిపల్ వైస్చైర్మన్ హరినారాయణ భట్టడ్, జనరల్ పిజిషియన్ కార్తీక్ హాజరై సరస్వతీ మాత చిత్రపటానికి, సంగీత వాయిద్య పరికరాలకు పూజలు చేశా రు. అనంతరం కవి జ్ఞానేశ్వర్ గౌడ్ను సన్మానించారు. కార్యక్రమంలో ఎస్పీ బాలు అభిమాన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మహిపాల్రెడ్డి, గాయకుడు నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
జడ్చర్లటౌన్, ఫిబ్రవరి 14 : వసంత పంచమి సందర్భంగా బుధవారం జడ్చర్లలోని పలు పాఠశాలల్లో సామూహిక అక్షరాభ్యాసన కార్యక్రమాలను నిర్వహించారు. స్థానిక శిశుమందిరం పాఠశాలలో పురోహితుల సమక్షంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. బాసరలోని శ్రీజ్ఞాన సరస్వతీ ఆలయం నుంచి తెచ్చిన కుంకుమ, సరస్వతీ మాత చిత్రపటాలను పిల్లల తల్లిదండ్రులకు అందజేసి చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం చేయించారు.
కృష్ణ, ఫిబ్రవరి 14 : వసంత పంచమి సందర్బంగా మండలంలోని ముడుమాల, కాన్దొడ్డి గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాల్లో అంగన్వాడీ టీచర్లు అక్షరాభ్యాసం చేయించారు.