కొల్లాపూర్, నవంబర్ 17: ఉమ్మడి పాలనలో అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న కొల్లాపూర్ నియోజకవర్గం తెలంగాణ హయాంలో ప్రగతిలో పరుగులు పెడుతున్నది. తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి కృషితో ఫలించింది. దీంతో అనతికాలంలో ప్రగతిబాట పట్టింది. రెండు తెలుగు రాష్ర్టాల సరిహద్దు అంచున ఉన్న కొల్లాపూర్ నియోజకవర్గం రూపురేఖలే మారిపోయాయి. సీఎం కేసీఆర్తో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డికి ఉన్న సంబంధాల కారణంగా నిధుల వరద పారించారు. రూ.887కోట్లతో కల్వకుర్తి (167కే )నుంచి కొల్లాపూర్ మీదుగా( తెలంగాణలో 87.కి.మీ ) నాలుగు వరుసల జాయతీ రోడ్డు నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయి. అలాగే రెండు తెలుగు రాష్ర్టాలైన తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య సోమశిల-సిద్ధేశ్వరం కృష్ణానదిపై ఐకానిక్ తీగల వంతెన నిర్మాణానికి రూ.975కోట్లు మంజూరయ్యాయి. దీంతో కొల్లాపూర్ పట్టణం దశ మారుతూ జంక్షన్గా ఆవతరించనున్నది. ఇటు సాగు, తాగునీటిరంగాలతో రహదారుల విస్తరణ, కొల్లాపూర్ పట్టణంలో చౌరస్తాలు సుందరీకణ, పార్కుల ఏర్పాటుతో రూపురేఖలు మారాయి. రూ.6కోట్లతో మాతా శిశుసంరక్షణ కేంద్రం, రూ.9లక్షలతో డయాలసిస్ సెంటర్, అధునాతన వైద్య పరికరాలతో బస్తీ దవాఖానల ఏర్పాటుతో పేదలకు వైద్యం అందుబాటులోకి వచ్చింది.
రూ.23కోట్లతో వంద పడకల దవాఖాన పనులు చురుకుగా సాగుతున్నాయి. రూ.కోటితో చుక్కాయపల్లి మినీ ట్యాంక్బండ్ పూర్తి కాగా రూ.4కోట్లతో పెంట్లవెల్లి చౌటచెరువు మినీ ట్యాంక్బండ్, వెడల్పు పనులు అసంపూర్తిలో ఉన్నాయి. మన ఊరు-మనబడి కింద నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో సుమారు 30 పాఠశాలల్లో అన్నిరకాల వనరులను కల్పించారు. పల్లెలు, పట్టణంలోనూ తెలంగాణ క్రీడాప్రాంగణాలు ఏర్పాటుతోపాటు తెలంగాణ హరితహారంలో భాగంగా ప్రకృతి వనాలు, నర్సరీల ఏర్పాటుతో పల్లెలన్నీ పచ్చదనం సంతరించుకుంది. కొల్లాపూర్ మండలం రెగుమాన్గడ్డ వద్ద శ్రీశైలం బ్యాక్వాటర్ ఆధారంగా రూ.52,500కోట్లతో నిర్మించిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లోని 12.40లక్షల ఎకరాలకు సాగు, 70మండలాల్లో 1546 చెరువులు నింపేలా, ఆయకట్టు గ్రామాలకు తాగునీరందించే భారీ ప్రాజెక్టు ఇక్కడే ఉండడం విశేషం. ఈ ప్రాజెక్టులో నార్లాపూర్ వద్ద మొదటి లిప్ట్లో ఒక మోటార్ను సెప్టెంబర్ 16న సీఎం కేసీఆర్ లాంచనంగా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి చొరవతో ప్రత్యేక అభివృద్ధి నిధులను మంజూరు చేయించి కొల్లాపూర్ పట్టణంలోని ప్రధాన రహదారి వెంట రాయికట్టుతో డివైడర్లను నిర్మించడం, దానిపై వివిధ రకాల ఆహ్లాదానిచ్చే పూల మొక్కలను నాటడంతో కొల్లాపూర్కు కొత్తందాన్ని తీసుకొచ్చాయి.
నాడు ఉమ్మడి పాలనలో కరువుకాటకాలు, వలసలకు నిలయమైన కొల్లాపూర్ నియోజకవర్గం నేడు సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో సాగు, తాగునీటి రంగాలకు పెద్ద పీటవేసి ఈ ప్రాంతం నుంచే ఉమ్మడి పాలమూరుతోపాటు పొరుగు జిల్లాలకు నీటిని తరలించేందుకుగానూ రూ52.500కోట్లతో చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు పూర్తికావచ్చాయి. 8.51 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో అంజనగిరి రిజర్వాయర్లో ప్రస్తుతం 2టీఎంసీల నీరు ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్గొం డ ఉమ్మడి జిల్లాల్లోని 12.40 లక్షల ఎకరాలు, 1546 చెరువులు నింపు తూ, ప్రతి గ్రామానికి తాగునీటినందించే పనులు అందితమ దశకు చేరాయి. అలాగే కొల్లాపూర్ మండలం ఎల్లూరు సమీపంలో కృష్ణానది నీటిని రూ,5,900కోట్లతో మిషన్భగీరథతో సుమారు 6వేల గ్రామాలకు ఇంటింటికీ తాగునీరందుతుంది. ఇక్కడి ఎంజీకేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా కొల్లాపూర్ నియోజకవర్గంలో 1.20లక్షల ఎకరాలకు సాగునీరందడంతో రైతులు రెండు పంటలు పండించుకొని ఆర్థికాభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నారు. ప్రతి గ్రామంలో రైతువేదికలు, హరితహారం, 24గంటలు కరెంట్, వైకుంఠధామాలు, క్రీడాప్రాంగణాలు, మన ఊరు-మనబడి ద్వారా 30 పాఠశాలల్లో సౌకర్యాల కల్పన జరిగింది. ఆసరా, వికలాంగులు, ఒంటరి మహిళలు, డయాలసిస్, ఎయిడ్స్ రోగులకు సైతం పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నది.
నియోజకవర్గంలో రూ.6.40కోట్లతో 32 రైతువేదికల నిర్మాణంతో సంబంధిత అధికారులు, రైతులకు ఎంతో మేలు చేకూరుతుంది. పాన్గల్ మండల కేంద్రంలో సహాయ వ్యవసాయశాఖ కార్యాలయం, కొల్లాపూర్లో ఆర్అండ్బీ సబ్ డివిజన్ ఆఫీస్, రెవెన్యూ డివిజన్ కార్యాలయాలు ఏర్పాటై ప్రజలకు వినియోగంలోకి వచ్చాయి. పెంట్లవెల్లిలో రూ.1.80కోట్లతో ఎంపీడీవో కార్యాలయం, రూ.కోటితో చుక్కాయపల్లి మినీ ట్యాంక్బండ్, రూ.4కోట్లతో చౌటచెరువు మినీట్యాంక్బండ్ పనులు, రూ. 1.80కోట్ల కేజీబీవీ పాఠశాల/కళాశాల భవనం ని ర్మాణం పూర్తయి విద్యాబోధన కొనసాగుతుంది. రూ.6కోట్లతో మా తాశిశు సంరక్షణ కేంద్రం, రూ.9లక్షలతో డయాలసిస్ సెంటర్ వినియోగంలోకి వచ్చింది. అదేప్రదేశంలో రూ.23కోట్లతో వందపడకల దవాఖాన పనులు జరుగుతున్నాయి. వీపనగండ్ల, పాన్గల్, కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి మండలాల్లో రూ.30కోట్లతో 10 చెక్కు డ్యాంలు నిర్మించింది. వీపనగండ్లలో 30 పడకల దవాఖాన, రూ.3.20కోట్లతో పెద్దకొత్తపల్లి, కోడేరు తాసిల్దార్ కార్యాలయాల నిర్మాణాలు జరుగుతున్నాయి. రూ.887 కోట్లతో కల్వకుర్తి (167కే)వయా కొల్లాపూర్ మీదుగా(తెలంగాణలో 87కి.మీ)వరకు ఫోర్లైన్ జాతీయ రోడ్డు పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. అలాగే రెండు తెలుగు రాష్ర్టాలైన తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య సోమశిల-సిద్ధేశ్వరం కృష్ణానదిపై ఐకానిక్ తీగల వంతెన నిర్మాణానికి రూ.975కోట్లు మంజూరయ్యాయి.