ఉమ్మడి పాలమూరు జిల్లాను మంచు దుప్పటి కప్పేసింది. సోమవారం పలు ప్రాంతాలంతా పొగమంచుతో నిండిపోయాయి. ఉదయం 9 గంటల వరకు భానుడు సైతం మంచులో చిక్కుకున్నాడు. రోడ్లు కనిపించకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
వాహనాలన్నీ లైట్ల వెలుతురులో రాకపోకలు సాగించాయి. మంకరలో పల్లె, పట్నాలు సరికొత్త అందాలతో కనువిందు చేశాయి. ముగ్ధమనోహరంగా మారిపోయాయి. మరో మూడ్రోజులు చలి ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ సూచనలతో ప్రజలు, పిల్లలు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.