వనపర్తి టౌన్, జూలై 20 : ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. సోమవారం వనపర్తి మండలంలోని పలు గ్రామాల్లో ఆయన బీఆర్ఎస్ నా యకులతో కలిసి పర్యటించి సర్ ప్రక్రియ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు చాలా కీలకమని, ప్రతి ఒక్కరూ తమకు అందజేసిన ఎస్ఐఆర్ ఫారాలను తప్పకుండా నింపి బీఎల్వోలకు అందజేయాలన్నారు.
అర్హులైన ఓటర్లు ప్రజాస్వామ్య వ్యవస్థకు స్ఫూర్తిగా నిలుస్తారన్నారు. ఓటర్ల నమో దు తుది జాబితాలో ఖచ్చితంగా ఉండేవిధంగా కృషి చేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. మాజీ మంత్రి వెంట నాయకులు మా ణిక్యం, ప్రేమ్నాథ్రెడ్డి, నందిమల్ల అశోక్, రఘువర్ధన్రెడ్డి, దేవర్ల నర్సింహ, మాధవ్రెడ్డి ఉన్నారు.