జడ్చర్ల/జడ్చర్లటౌన్, అక్టోబర్ 17 : దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జడ్చర్ల పట్టణంలో ని పలు ఆలయాల్లో అమ్మవారిని వివిధ రూపా ల్లో ఆలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం స్థానిక వాసవీకన్యకాపరమేశ్వరీ ఆలయంలో ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో అమ్మవారిని స్కందమాతగా అలంకరిం చి ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా పట్టణంలోని పాతబజార్ ఆంజనేయస్వామి ఆలయంలో అన్నపూర్ణాదేవిగా అమ్మవారు భక్తులకు దర్శమించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అదేవిధంగా జడ్చర్లలోని సకలదేవతల ఆలయ ఆవరణలో ప్ర తిష్ఠించి దుర్గామాతకు ఆలయ నిర్వాహకులు, భ క్తులు ప్రత్యేక పూజలు చేశారు. బూరెడ్డిపల్లి గ్రా మంలోని శివాలయంలో అమ్మవారికి భక్తులు పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో పాతబజార్ దుర్గమాత కమిటీ గౌరవ అధ్యక్షులు బి. జగదీశ్ సింగ్, పి.రవిముదిరాజ్, ఎ.శ్రీశైలం, ఎస్. గణేశ్, అధ్యక్షుడు ఎ.హరికుమార్ ముదిరాజ్, ఉపాధ్యక్షుడు విక్కీ, ప్రధాన కార్యదర్శి కె. భాస్కర్ ముదిరాజ్, కోశాధికారులు గణేశ్, శిరీష్కుమార్, ప్రచార కార్యదర్శులు గుడ్ల రాము, పండ్ల రాఘవేందర్, దుర్గం రాము తదితరులు పాల్గొన్నారు.
మిడ్జిల్లో..
మిడ్జిల్, అక్టోబర్ 17 : దేవీనవరాత్రి ఉత్సవాలు మండల కేంద్రంతోపాటు మల్లాపూర్, వేముల, వాడ్యాల్, దోనూర్, గ్రామాల్లోని ఆలయాల్లో ప్రతిష్ఠించిన అమ్మవార్లకు భక్తులు భక్తిశద్ధ్రలతో పూజలు నిర్వహించారు. మంగళవారం మండల కేంద్రంలో ఇదమ్మ ఆలయంలో ఏ ర్పాటు చేసిన దుర్గామాత అన్నపూర్ణ దేవి అవతారంలో భక్తులకు దర్శనమించారు. కార్యక్రమం లో అలయ కమిటీ అధ్యక్షుడు శంక ర్, పీఏసీసీఎస్ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, వెంకట్రెడ్డి, విజయ్కుమార్, గోపా ల్, కుమార్, రామకృష్ణ, రాఘవేందర్, మల్లయ్య, జంగయ్య, జగన్గౌడ్, వెంకటేశ్ పాల్గొన్నారు.
బాలానగర్లో..
బాలానగర్, అక్టోబర్ 17 : మండలంలోని ఉడిత్యాలలో దేవీ శరన్నరాత్రి ఉత్సవా లు మంగళవారంకొనసాగాయి. మండపంలో వెలిసిన అమ్మవారు అన్నపూర్ణ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అలాగే మహిళలు కలశాలలో పురవీధుల గుండా ఊరేగించి శివాలయంలో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశా రు. కార్యక్రమంలో శివాంజనేయస్వామి భజన మండలి భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
పాలమూరులో..
పాలమూరు, అక్టోబర్ 17 : పట్టణంలోని వాసవీ కన్యకాపరమేశ్వరీ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మంగళవారం సంతానలక్ష్మి అలంకారంలో అమ్మవారికి ప్రత్యేక పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు సామూహిక కుంకుమార్చన పూజలు వైభవంగా నిర్వహించారు.