వనపర్తి, ఫిబ్రవరి 15 : గిరిజనుల ఆరాధ్యదైవం సంత్ సేవాలాల్ మహరాజ్ అని, జాతి పునర్జీవ నం, ఔన్నత్యానికి పాటుపడిన మహనీయుడని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన భవనలో గురువారం సంత్సేవాలాల్ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనుల సంక్షేమం కోసం దిశానిర్ధేశం చేసి హైందవ సంస్కృతిని పెంపొందించిన మహనీయుడని, మూఢనమ్మకాలను పారదోలి గిరిజనులను చైతన్యం చేశారన్నారు.
నిజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాటం చేసినందుకే మహరాజ్గంజ్గా అతడి పేరు మీద వెలిసిందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్ చైర్మన్ శ్రీధర్, మీడియా కన్వీనర్ అశోక్, కౌన్సిలర్ లక్ష్మీనారాయణ, కృష్ణ, మహేశ్, రవి, కృష్ణ, రాములు, జంపన్న, బా షానాయక్, నాయకులు పరంజ్యోతి, ప్రేమ్నాథ్రెడ్డి, తిరుమల్, కృష్ణ, రహీం, గోపాల్ పాల్గొన్నారు.