మహబూబ్నగర్ టౌన్, జనవరి 28 : భద్రాద్రి కొత్తగూడెంలో ఫిబ్రవరి 10వ తేదీన నిర్వహించను న్న రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ టోర్నీలో పాల్గొనే జిల్లా అండర్-10, 12, 14 బాల, బాలికల జట్ల ఎంపికలను ఆదివారం స్థానిక క్రీడా మైదానంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా అథ్లెటిక్స్ సంఘం ప్రధాన కార్యదర్శి శరత్చంద్ర మా ట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. రాష్ట్రస్థాయి టోర్నీలో ప్రతిభ చాటి పతకాలు సాధించి జిల్లాకు, తల్లిదం డ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆనంద్కుమార్, కోచ్ సునీల్, పీఈటీలు శ్రీనివాస్, రాజు, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.