మహబూబ్నగర్ టౌన్, డిసెంబర్ 8 : నల్లగొండ జిల్లాలో నేటి నుంచి నిర్వహించనున్న రాష్ట్రస్థాయి షూటింగ్బాల్ పోటీలకు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మైనార్టీ గురుకుల విద్యార్థులు అల్తాఫ్, రియాజ్, ఖా జా, ఈశ్వర్, అఫీల్, బాబా, హర్ష, ఇస్మాయిల్, పర్హాన్, చాంద్పాషా, నవరత్నం, రాంచరణ్ ఎంపికయ్యారు.
శుక్రవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోటీలకు ఎంపికైన ఆర్ఎల్సీ ఖాజా బహుద్దీన్ అభినందించారు. రాష్ట్రస్థాయి టోర్నీలో ప్రతిభ జట్టు విజయానికి కృషి చేయాలని ఆకాక్షించారు. కార్యక్రమంలో జమీర్అహ్మద్ఖాన్, మహమూద్అలంఖాన్, సలీమ్, మహ్మద్జహీర్, ప్రిన్సిపాల్ సమీ, వ్యాయమ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.