జడ్చర్లటౌన్, మే 19 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు కార్యక్రమంలో 18ఏండ్లు నిండి న ప్రతిఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి సూచించారు. మున్సిపాలిటీలోని 26వ వార్డులో శుక్రవారం కంటివెలుగు శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన అద్దాలు, మందులను పంపి ణీ చేస్తున్నదన్నారు. కంటివెలుగు కార్యక్రమం పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నదని తెలిపారు. 26వ వార్డులో మొత్తం 175మందికి పరీక్షలు నిర్వహించి 13మందికి అద్దాలను ఇచ్చారు. మరో నలుగురికి అద్దాల కోసం ఆర్డర్ చేశారు. మండలంలోని లక్ష్మీనాయక్తండాలో 127మందికి పరీక్షలు నిర్వహించి 25మందికి అద్దాలను అందజేశారు. మరో ఏడుగురికి అద్దాల కోసం ఆర్డర్ చేశారు. గొల్లపల్లిలో 155 మందికి పరీక్షలు నిర్వహించి 14మందికి అద్దాలను పంపిణీ చేశారు. మరో 10మందికి అద్దాల కోసం ఆర్డర్ చేసినట్లు డాక్టర్ శివకాంత్ తెలిపారు.
బాలానగర్ మండలంలో..
బాలానగర్, మే 19 : మండలంలోని వీరన్నపల్లిలో 171మందికి కంటి పరీక్షలు నిర్వహించి 8మందికి అద్దాలను పంపిణీ చేసినట్లు వైద్యసిబ్బంది తెలిపారు. మరో ఐదుగురికి అవసరమైన అద్దాల కోసం ఆర్డర్ చేసినట్లు పేర్కొన్నారు.
నవాబ్పేట మండలంలో..
నవాబ్పేట, మే 19 : మండలంలోని దర్పల్లి, ఊరంచుతండా, సిద్ధోటం గ్రామా ల్లో కంటివెలుగు శిబిరాలు కొనసాగాయి. దర్పల్లిలో 158మందిని పరీక్షించి 26మందికి అద్దాలను అందజేశారు. మరో 25మందికి అద్దాల కోసం ఆర్డర్ చేశారు. ఊరంచుతండాలో 171 మందిని పరీక్షించి 18మందికి అద్దాలు అందజేయగా, మరో 34మందికి అద్దాల కోసం ఆర్డర్ పెట్టారు. సిద్ధోటంలో 141మందికి కంటి పరీక్షలు నిర్వహించి, ఆరుగురికి అద్దాలు పంపిణీ చేశారు. మరొకరికి అద్దాల కో సం ఆర్డర్ చేశారు. కార్యక్రమంలో క్యాంపు అధికారు లు శ్రీజ, బింధుశ్రీ, తేజశ్రీ, సర్పంచులు సోనీబాయి, వెంకటేశ్, వసుంధర, నాయకులు శంకర్నాయక్, సి బ్బంది బీచుపల్లిగౌడ్, రాములు, శ్రీనివాస్ ఉన్నారు.
భూత్పూర్ మండలంలో..
భూత్పూర్, మే 19 : మండలంలోని శేరిపల్లి(హెచ్)లో కంటివెలుగు శిబిరాన్ని సర్పంచ్ బోల శేఖర్ ప్రారంభించారు. మొత్తం 162మందికి కంటి పరీక్షలు నిర్వహించి 40మందికి అద్దాలను పంపిణీ చేసినట్లు సీహెచ్వో రామయ్య తెలిపారు. మరో 31మందిని శస్త్రచికిత్సకు రెఫర్ చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డాక్టర్లు రాధిక, హిమబిందు, సూపర్వైజర్ సుధాకర్, ఏఎన్ఎంలు రోజాలక్ష్మి, రజిత, అంగన్వాడీ టీచర్ పుష్ప, బీఆర్ఎస్ నాయకులు వెంకట్రాములు, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
చిన్నచింతకుంట మండలంలో..
దేవరకద్ర రూరల్(చిన్నచింతకుంట), మే 19 : చిన్నచింతకుంట మండలం ఏదులాపూర్లో 152 మందికి పరీక్షలు నిర్వహించి 30మందికి అద్దాలను అందజేశారు. మరో ఏడుగురికి అద్దాల కోసం ఆర్డర్ చేశారు. నెల్లికొండిలో 154మందికి పరీక్షలు నిర్వహించి ఇద్దరికి అద్దాలను పంపిణీ చేయగా, మరో ఇద్దరికి అద్దాల కోసం ఆర్డర్ చేశారు. కార్యక్రమంలో డాక్ట ర్లు సనా, సంతోష్, రాహుల్, క్యాంప్ కోఆర్డినేటర్ శ్రీనివాసులు, ఖాదర్ పాల్గొన్నారు.