జడ్చర్లటౌన్, జనవరి 7 : జడ్చర్ల మండలం పోలేపల్లి గ్రామంలోని శిథిల ఆలయాలు, శిల్పకళాఖండాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పురావస్తు పరిశోధకుడు, ఫ్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి అన్నారు. వారసత్వ స్థలాలు, కట్టడాలను కాపాడుకోవాలన్న అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆయన ఆదివారం పోలేపల్లి గ్రామ పరిసరాల్లో పర్యటించారు. వెయ్యేండ్ల నాటి శివాలయం, చెన్నకేశవ ఆలయం, నిలువెత్తు భైరవ, వీరగల్లు శిల్పాలు, కాకతీయుల నాటి వినాయకుడు, కార్తికేయ, సప్తమాతల శిల్పా లు, భిన్నమైన చెన్నకేశవ శిల్పాన్ని పరిశీలించారు. వీరభద్రుని ఆలయం వద్ద భూమిలో కూరుకుపోయిన క్రీ.శ.1099వ సంవత్సరం, జూలై 18వ తేదీ సోమవారం నాటి శాసనం, కల్యాణిచాళుక్య చక్రవర్తి త్రిభువనమల్ల ఆరో విక్రమాదిత్యుని సైన్యాధ్యక్షుడైన రుద్ర దండనాయకుడు స్థానిక రుద్రేశ్వర,
కేశవదేవ, ఆదిత్య దేవుల నైవేద్యానికి భూమిని దా నం చేసినట్లుగా వివరాలు ఉన్నాయని తెలిపారు. పోలేపల్లి చెన్నకేశవ, త్రికూటాలయాల చుట్టూ కం ప పెరిగి, ఆలయాలు శిథిలమైనట్లు, పురాతనమైన శిల్పాలు నిర్లక్ష్యంగా పడి ఉన్నాయన్నారు. పోలేప ల్లి గ్రామ చరిత్రకు అద్దం పడుతున్న వారసత్వ కట్టడాలకు పరిరక్షించి, చారిత్రక శిల్పాలు, శాసనాన్ని కాపాడుకోవాలని గ్రామస్తులకు ఆయన విజ్ఞప్తి చే శారు. పురాతన చారిత్రత్మాకమైన కళాఖండాలను కాపాడుకునే విషయంలో ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. ఆయన వెంట మాజీ వీఆర్వో బచ్చన్నగౌడ్, వెంకటరెడ్డి, ప్రణయ్ పాల్గొన్నారు.