మదనాపురం, అక్టోబర్ 28: దేవరకద్ర నియోజకవర్గంలో అభివృద్ధే మంత్రంగా పనిచేస్తున్నా.. 30రోజలు కష్టపడి పనిచేయండి.., 5ఏండ్లు మీకు సేవ చేసేందుకు నేను రెడీగా ఉన్నానని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వ్రెడ్డి పేర్కొన్నారు. శనివారం మండలంలోని దంతనూరు శివారులో ఏ1 ఫంక్షన్ హాల్లో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేతోపాటు మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్రెడ్డి హాజరై కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఎన్నికల మ్యానిఫెస్టోలోని ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరించాలని సూచించారు. సంక్షేమ పథకాలతో లబ్ధిపొందిన ప్రతి కుటుంబాన్ని విసుగు చెందకుండా కలవాలని, సమయం కేటాయించి వారితో మాట్లాడాలని, గ్రామాల్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం రావుల చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ.. దేవరకద్ర నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆల రెండు టర్ముల్లో ఎంతో అభివృద్ధి చేశారని ఇలాంటి ఎమ్మెల్యేను బీఆర్ఎస్ కార్యకర్తలు వదులుకోవద్దన్నారు. మళ్లీ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్సే గెలుస్తుందని, దేవరకద్రలో ఎమ్మెల్యేగా ఆలనే గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్లో చేరిన బీజేపీ వార్డు సభ్యుడు
కొత్తకోట, అక్టోబర్ 28: మండలంలోని నాటవెల్లికి చెందిన బీజేపీ ఆరో వార్డు సభ్యుడు నరేశ్గౌడ్ సర్పంచ్ ఎద్దుల నగేశ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆల సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే పట్టణంలోని వాల్మీకి ఆలయంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు.
కర్ణాటకలో బోర్లపడ్డారు
కొత్తకోట, అక్టోబర్ 28: కర్ణాటకలో కాంగ్రెస్కు అధికారం ఇచ్చి అమలు కానీ హామీలతో బోర్లపడ్డారని, సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు అమలు చేస్తారని అందుకోసం ప్రతి కార్యకర్త మ్యానిఫెస్టో అంశాలను గడపగడపకూ చేరవేయాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. శనివారం రాత్రి పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్రెడితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఆయా గ్రామాలకు ఆ గ్రామ నాయకుడే కథానాయకుడిగా వ్యవహరించాలని సూచించారు. అలసత్వం వీడి ప్రతిఓటరును కలిసి మ్యానిఫెస్టో అంశాలను వివరించాలన్నారు. ఎదురు దాడిచేసే వారికి నచ్చజెప్పాలన్నారు.
అందరూ పాలు పోయండి
రాజుగారి పాలన మాదిరిగా ఒకరు పాలు.. ఒకరు నీరు పోసే ప్రయత్నం చేయొద్దని.. అందరు కలిసి పాలు పోస్తే కేసీఆర్ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి అవుతారన్నారు. సంక్షేమం, అభివృద్ధి జరగాలంటే ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డిని ఆశీర్వదించాలన్నారు.
అలాగే కానాయపల్లి, నాటవెల్లి, నాటవెల్లిపెద్దతండాకు చెందిన టీడీపీ, కాంగ్రెస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే రావుల, ఎమ్మెల్యే ఆల సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పొకొని పార్టీలో చేరారు. కానాయపల్లి మాజీ సర్పంచ్ యాదయ్యసాగర్, రఘువర్ధన్రెడ్డి, డీలర్ శ్రీనివాసులు, కిషన్నాయక్తోపాటు వంద మంది చేరారు. ఆయా కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ వామన్గౌడ్ ఎంపీపీలు గుంత మౌనిక, పద్మావతీ, దేవరకద్ర నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు జయంతి, మార్కెట్ చైర్మన్ శ్రావణ్కుమార్రెడ్డి, జెడ్పీటీసీ కృష్ణయ్య, సీడీసీ చైర్మన్ చెన్నకేశవరెడ్డి, విశ్వేశ్వర్, ఉమ్మడి జిల్లాల అధికార ప్రతినిధి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.