నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఫిబ్రవరి 15 : గిరిజనుల ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలను జిల్లావ్యాప్తంగా శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భోగ్ భండార్ నిర్వహించడంతోపాటు సంత్ సేవాలాల్ ఆలయాల్లో పూజలు చేశారు. ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. సేవాలాల్ చూపిన మార్గం ప్రతిఒక్కరికీ ఆదర్శనీయమన్నారు.
ధర్పల్లిలోని అన్ని తండాల్లో సేవాలాల్ జయంతి, వేడుకలు నిర్వహించారు. ఇందల్వాయి మండలకేంద్రంలో నిర్వహించిన భోగ్ భండార్ కార్యక్రమానికి ఎంపీపీ రమేశ్నాయక్ హాజరయ్యారు. రుద్రూర్ మండలంలోని సులేమాన్నగర్ తండాలో గిరిజన పెద్దల ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించి, సేవాలాల్ చిత్రపటానికి క్షీరాభిషేకం, పూజలు చేశారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజనులు చేసిన సంప్రదాయ నృత్యాలు చేశారు. వర్ని మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలతోపాటు తండాల్లో సేవాలాల్ జయంతి నిర్వహించారు. డిచ్పల్లిలోని టీయూలో ఓల్డ్ బాయ్స్ హాస్టల్లో సేవాలాల్ జయంతిని ఎస్సీ, ఎస్టీ సెల్ డైరెక్టర్ డాక్టర్ భ్రమరాంబిక అధ్యక్షతన నిర్వహించారు. రిజిస్ట్రార్ యాదగిరి హాజరై మాట్లాడారు. సిరికొండ మండలకేంద్రంలోని బంజారాభవన్లో భోగ్ భండార్, ప్రత్యేక పూజలు నిర్వహించారు. చీమన్పల్లిలో ఆలిండియా బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు విఠల్నాయక్ ఆధ్వర్యంలో భోగ్ భండార్ నిర్వహించారు. మండలస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ను కాంగ్రెస్ పార్టీ డీసీసీ మాజీ అధ్యక్షుడు తాహెర్బిన్ హందాన్ ప్రారంభించారు.
మాక్లూర్ మండలంలోని మానిక్బండార్, అమ్రాద్ గ్రామాల్లో నిర్వహించిన ఉత్సవాల్లో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి పాల్గొన్నారు. భీమ్గల్ మండలంలోని తండాల్లో ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఏర్గట్ల మండలంలోని బట్టాపూర్ తండాలో జగదాంబ, సేవాలాల్ ఆలయాల వద్ద భోగ్ భండార్ నిర్వహించి నైవేద్యం సమర్పించారు. బోధన్ మండలంలోని రాజీవ్నగర్ తండా, ఊట్పల్లి, బెల్లాల్, మినార్పలి,్ల ఆటోనగర్ తదితర తండాల్లో సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.