వనపర్తి, మార్చి 3 (నమస్తే తెలంగాణ) : పారిశుధ్య కార్మికుల కష్టాలు వర్ణణాతీతం. గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న లేబర్కు జీతాలు రాక అష్టకష్టాలు పడుతున్నారు. ఒకటికాదు.. రెండు కాదు.. ఏకంగా నాలు గు నెలలుగా జీతాలు అందడం లేదు. దీంతో కుటుంబ పోషణ కోసం దొరికిన పైసలు తెచ్చుకుంటుండడంతో అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. శానిటేషన్ వి భాగంలో పూట గడవలేని వారే పనిచేస్తుంటారు. అ లాంటి వారికి అనేక కారణాలతో నెలల తరబడి వారికిచ్చే చిన్న జీతాలను నిలిపి వేస్తే ఎలా గడుస్తుందో తెలుసుకుంటే మనసు తరుక్కుపోతుంది. జిల్లాలో కొన్ని చోట్ల నాలుగు నెలల జీతాలు రావాల్సి ఉన్నది. మరికొన్ని చోట్ల రెండు నెలలు అందాల్సి ఉన్నది.
వనపర్తి జిల్లాలోని 255 గ్రామ పంచాయతీల్లో 1,058 మంది పారిశుధ్య కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ మ ల్టీపర్పస్ వర్కర్స్కు నెలకు రూ.9,500 వేతనాన్ని ప్ర భుత్వం చెల్లిస్తుంది. ముందుగా రూ.8,500 ఉండగా.. గత కేసీఆర్ ప్రభుత్వం జీతాలను కొంత పెంచింది. నా టి సర్కారు పెండింగ్ లేకుండా అందించింది. ఎప్పుడో ఒకసారి ఒకటి.. అర జీతాలు వచ్చినా ఇన్ని నెలలు పెం డింగ్ పడలేదని కార్మికులు అంటున్నారు. కానీ నేటి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వేతనాలు చెల్లించే విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నది.
జిల్లాలోని 255 గ్రామపంచాయతీలకుగానూ అన్ని గ్రామ పంచాయతీల్లో దాదాపు రెండు నెలల జీతాలు పారిశుధ్య కార్మికులకు అందాల్సి ఉన్నది. జనవరి, ఫిబ్రవరి వేతనాలు రావాలి. ఫిబ్రవరి ఒకటో తేదీతో సర్పంచుల పదవీకాలం ముగియడంతో జనవరిలోనే జీపీ అ కౌంట్లన్నీ లాక్ అయ్యాయి. కొన్ని చిన్న గ్రామ పంచాయతీల్లో డబ్బులు లేక కార్మికులకు వేతనాలు ఇవ్వలే దు.
అప్పటికే ఉన్న డబ్బులన్నీ చేసిన పనులకు ఖర్చుకావడం.. ఇంకా కొన్ని పనులకు సరిపోకపోవడం వం టి పరిస్థితులు అనేక గ్రామ పంచాయతీల్లో నెలకొన్నా యి. చివరి దశ పదవీ కాలంలో ఉన్న సర్పంచులు కొం దరు ఉన్న డబ్బులను తీసుకునే ప్రయత్నం చేయడం తో జీపీల అకౌంట్లన్నీ ఖాళీ అయ్యాయి. ఇలా అన్ని స మస్యలు నేడు గ్రామాల్లో పనిచేస్తున్న కార్మికుల మెడ కు చుట్టుకోవడంతో వేతనాలందలేదు. చిన్న జీపీ ల్లో ట్రాక్టర్ కంతులు, కరెంట్ బిల్లులకు చెల్లింపులు చే యడంతో కార్మికుల వేతనాలకు బ్రేక్ పడుతూ వచ్చింది.
వనపర్తి జిల్లాలోని పలు గ్రామ పంచాయతీల్లో నా లుగు నెలలుగా జీతాలు నిలిచిపోవడంతో పస్తులే అని కార్మికులు వాపోతున్నారు. పైసలుండి చెక్కులు జనరేట్ అయినప్పటికీ ఎస్టీవో కార్యాలయాల్లో పెండింగ్ లో పడ్డాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి గ్రామ పంచాయతీల చెక్కులు ఒకటి కూడా ఎస్టీవోల ద్వారా అమలు కాలేదని కార్మికులు, తాజీ మాజీ సర్పంచులు ఆవేదన చెందుతున్నారు. ఇక చిన్న గ్రామ పంచాయతీల్లో డబ్బుల కొరత కనిపిస్తున్నప్పటికీ కార్మికులు మాత్రం ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నా రు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు నెల ల జీతాలు రాకుంటే ఎలా పని చేయాలని కార్మికులు నిలదీస్తున్నారు. రూ.లక్షలాది జీతాలు తీసుకునే అధికారులు వారం రోజులు వేతనాలు రాకుంటేనే గోల చే స్తారని, మాలాంటి నిరుపేదలకు ఇన్ని నెలలుగా రా కుంటే ఏం తినాలని వాపోతున్నారు.
ప్రతి గ్రామ పంచాయతీకి ఎస్ఎఫ్సీ, 15వ ఆర్థిక సంఘం నిధుల అకౌంట్లు వేర్వేరుగా ఉంటాయి. వీటికి అదనంగా గ్రామ పంచాయతీ అకౌంట్ ప్రత్యేకంగా ఉంటుంది. అయితే కార్మికుల వేతనాలు మాత్రం ఎక్కువగా ఎస్ఎఫ్సీ అకౌంట్ ద్వారానే చెల్లింపులు జరుగుతాయి. ఇక 15వ ఆర్థిక సంఘం నిధుల లావాదేవీలన్ని డిజిటల్ అకౌంట్ ద్వారానే జరుగుతాయి. ఇందుకు సంబంధించిన నిర్వహణ జిల్లా కేంద్రం నుంచి ఉం టుంది. ఎన్నికలకు ముందు నుంచి ఎస్ఎఫ్సీ నిధుల లావాదేవీలు ట్రెజరీ కార్యాలయాల్లో పూర్తిగా నిలిచిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు నెలలు గడిచినా గ్రామ పంచాయతీ కార్మికుల చెక్కులకు మాత్రం మోక్షం రావడం లేదు. 15వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి డిజిట ల్ కీ లాక్ను క్రమం చేస్తే కనీసం కార్మికుల జీతాల సమస్యనైనా తొలగిపోయే అవకాశం ఉన్నది.
పారిశుధ్య కార్మికులకు కొన్ని జీపీల్లో నా లుగు నెలలుగా వేతనాలు పెండింగ్లో ఉ న్నాయి. జిల్లాలో మూడు నుంచి నాలుగు నెలలుగా కార్మికులకు జీతాలు అందని గ్రా మాల వారీగా చూస్తే.. మదనాపురం మం డలంలో 8 గ్రామ పంచాయతీలు, కొత్తకో ట మండలంలో 5 జీపీలు, వీపనగండ్లలో 4 జీపీలు, అమరచింతలో 2 జీపీలు, వనపర్తిలో 2, పాన్గల్లో 2, గోపాల్పేటలో 2, పెద్దమందడిలో ఒక గ్రామపంచాయతీ లో నాలుగు నెలలుగా జీతాలు రాకపోవడంతో కార్మికుల కష్టాలు చెప్పనలవికావు.
మాకు నాలుగు నెలల నుంచి జీతాలు రావడం లేదు. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు జీతాలు రాలేదు. చిన్న కుటుంబా ల నుంచి వచ్చిన మేం జీతాలు ఇవ్వకుంటే పను లు ఎలా చేసేది. మాకు ఇచ్చే జీతం చాలా తక్కు వ. నెలకు సక్రమంగా వస్తేనే కుటుంబం గడుప డం కష్టం. ఇలా నెలల తరబడి పెండింగ్ పెడితే పస్తులుంచాల్సి వస్తుంది. జీతం వస్తుందని ఏదైనా కార్యం పెట్టుకుంటే అంతేసంగతులు. చాలా ఇబ్బందులు పడుతున్నాం. మా జీతాలు ఇచ్చి ఆదుకోండి.
– సుంకులమ్మ, జీపీ కార్మికురాలు, వీపనగండ్ల గ్రామం, వనపర్తి జిల్లా
మాకు 4 నెలలుగా జీతాలు రావడం లేదు. ఎప్పుడు అడిగినా వ స్తుంది.. ఇస్తాం అంటా రు.. కానీ అందించడం లేదు. ఒక్క నెల రాకుంటే ఎలాగో గడుపు తాం. కానీ నాలుగైదు నెలలుగా అందకుంటే ఫ్యామిలీని ఎలా నడపాలి. మావి పూట గడవని బ తుకులు.. రేవంత్ సర్కారు అర్థం చేసుకోవాలి. మా మొరను ఆలకించాలి. అధికారులు చెక్కు పంపించాం.. ఎస్టీవోలో ఆగిపోయిందని చెబుతున్నారు. మా బాధ ఎవరికి చెప్పాలో అర్థం కావడం లేదు. పండుగలు, ఇంట్లో పరిస్థితులు, అనారోగ్య సమస్యలు తలెత్తినా మళ్లీ అప్పు చేయాల్సి వస్తుంది. అధికారులు వెంటనే మా జీతాలు ఇవ్వాలి.
– ఉమాశంకర్, మదనాపురం గ్రామం, వనపర్తి జిల్లా
డిజిటల్కీ సంబంధిం చి రెండురోజుల్లో సమ స్య పరిష్కారం అవుతుం ది. ఇటీవలే జిల్లా స్థాయి లో అధికారుల బదిలీలు జరుగుతుండడం.. కొత్త అధికారులు రావడంతో కొంత సమయం తీసుకుంటుంది. జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న కార్మికులకు జీతాల సమస్య లేకుండా చూస్తాం. కొన్ని జీపీలు ఎస్టీవోలో వేసిన చెక్కులు పెండింగ్లో ఉండటంతో రెండు, మూడు నెలల జీతాలు పెండింగ్లో పడ్డాయి. డిజిటల్ కీని క్రమబద్ధీకరించి జీతాల సమస్య లేకుండా చూస్తాం.
– రఘునాథ్రెడ్డి, డీఎల్పీవో, వనపర్తి జిల్లా