నాగర్కర్నూల్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ) : పల్లెల్లో పారిశుధ్య కార్యక్రమాల అమలుకు పంచాయతీ రాజ్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. బుధవారం నుంచి ఈనెల 15వ తేదీ వర కు నిర్వహించే స్పెషల్డ్రైవ్ కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సర్పంచుల కాలపరిమితి ముగిసిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ప్రత్యేకాధికారుల పర్యవేక్షణలో పారిశుధ్య వారోత్సవం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గ్రామాల్లో ఇండ్ల మధ్య పేరుకుపోయిన చెత్త, మురుగు తొలగించడం, బ్లీ చింగ్ పౌడర్ చల్లడం వంటి పనులు చేపట్టనున్నారు. అలాగే ఇంటింటికీ వెళ్లి సమస్యలను తెలుసుకోనున్నారు. వేసవికాలం సమీపిస్తున్న నేపథ్యంలో తాగునీటి సమస్యలను గుర్తించడం, పైపులైన్ల లీకేజీని అరికట్టడం, కొత్తగా అవసరమైన బోర్లు, పైపులై న్లు వేయడం, వీధి లైట్ల వంటి సమస్యలనూ గు ర్తించనున్నారు. స్థానిక సంస్థల పర్యవేక్షణలోనే తాగునీటి నిర్వహణ జరగాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. నర్సరీల పర్యవేక్షణ, డంపింగ్ యార్డు, శ్మశాన వాటిక నిర్వహణ, పారిశుధ్య పనులు చేసేందుకు కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక అం గన్వాడీలు, స్కూళ్లు, పీహెచ్సీలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద పిచ్చి మొక్కలు, చెత్త తొలగింపు, పాడుబడ్డ బావులను పూడ్చడం వంటి పనులు చేపడతారు. ఈ కార్యక్రమ అమలు కోసం ఇప్పటికే ఆయా జిల్లాల అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించి లక్ష్యాలు నిర్దేశించారు.
అయితే గ్రామాల్లో తగిన స్థాయిలో పారిశుధ్య సిబ్బంది లేరు. అదే విధంగా పారిశుధ్య కార్మికులకు మూడు నెలలుగా వేతనాలు పెండింగ్లో ఉ న్నాయి. ట్రాక్టర్ల డీజిల్ బిల్లుల కోసం అధికారులు ఎ దురుచూస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల నుంచి గ్రామా ల్లో పర్యవేక్షణ కరువైంది. కనీస పారిశుధ్య చర్యలనూ పట్టించుకునే నాథుడే లేరు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారించలేదు. ఫలితంగా బకాయిల భారం, సిబ్బంది లేమి సమస్య లు గ్రామ పంచాయతీల నిర్వహణకు భారంగా మా రాయి. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పల్లె ప్రగతి పేరి ట జరిగే పారిశుధ్య వారోత్సవాల్లో సర్పంచులు, ఎం పీటీసీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు భాగమయ్యేవారు. ఇప్పుడు ప్రజాప్రతినిధులు పాల్గొనడం సందేహంగా మారింది. స్థానికంగా కాంగ్రెస్కు పట్టు లేకపోవడంతో ఎమ్మెల్యేలు వంటి ప్రజాప్రతినిధులూ భాగం కాలేకపోవడంతో స్పెషల్ డ్రైవ్ భారమంతా అధికారులపై పడింది. మరి ఈ కార్యక్రమం ఎంత వరకు సక్సెస్ అవుతుందన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా పారిశుధ్య స్పెషల్ డ్రైవ్ ఉ మ్మడి పాలమూరులోని 1,692 గ్రామ పంచాయతీల్లోని ప్రత్యేక అధికారులకు సవాల్గా నిలవనున్నది.
ప్రభుత్వ ఆదేశాలతో బుధవారం నుంచి ఈ నె ల 15వ తేదీ వరకు పారిశుధ్య వారోత్సవాలు నిర్వహించనున్నాం. అధికారులకు శిక్షణ ఇచ్చాం. పారిశుధ్యం, తాగునీటి సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం. ప్రత్యేకాధికారుల ఆధ్వర్యంలో కార్యదర్శులు ప్రతిరోజూ జరిగే కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటాం.