అచ్చంపేట, ఫిబ్రవరి 4 : అచ్చంపేట ప్రభుత్వ ఏరియా దవాఖానలో పనిచేస్తున్న పారిశుధ్య సి బ్బంది, సెక్యూరిటీ గార్డులకు నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు. దీంతో పెండింగ్ వేతనాలు చెల్లించాలని ఆదివారం ఉదయం దవాఖాన ఎదుట పారిశుధ్య సిబ్బంది ఆందోళన ని ర్వహించా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వకుంటే తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ఆవేదన వ్య క్తం చేశారు.
ఏజెన్సీ నిర్వాహకులు జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, వేతనాలు చెల్లించకుంటే పనులు నిలిపివేస్తామని హెచ్చరించా రు. సీఐటీయూ నాయకులు మద్దతు తెలిపారు. వి షయం తెలుసుకున్న దవాఖాన సూపరింటెండెంట్ ప్రభు అక్కడికి వచ్చి ప్రభుత్వం నుంచి బిల్లులు రా కపోవడంతో వేతనాలు చెల్లించలేదని, ఏజెన్సీ వారి తో మాట్లాడుతామని హామీ ఇవ్వడంతో సిబ్బంది ఆందోళన విరమించారు.