పెద్దకొత్తపల్లి, జనవరి 29 : గ్రామాల అభివృద్ధి కోసమే రూర్బన్ మిషన్ పథకం ఏర్పాటు చేసి రూ. 30 కోట్లు మంజూరు చేసినట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. మండలంలోని పెద్దకారుపాములలో రూర్బన్ మిషన్ పథకం ద్వారా పూర్తయిన భవనాలను సోమవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందిస్తామన్నారు. ప్రభుత్వం పేదల ఆరోగ్యం కోసం ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల భరోసా కల్పిస్తున్నదని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ప్రతాప్గౌడ్, జెడ్పీటీసీ గౌరమ్మ, సర్పంచులు వెంకటేశ్వర్రెడ్డి, రాధ, సత్యం, రమేశ్రావు, నర్సింహ, చంద్రయ్య పాల్గొన్నారు.
పాన్గల్, జనవరి 29 : గ్రామాల సంపూర్ణాభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం మండలంలోని బుసిరెడ్డిపల్లి గ్రామంలో ఈజీఎస్ నిధులు రూ. 20 లక్షలతో నిర్మించతలపెట్టిన నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తుందన్నారు. ఆరు గ్యారెంటీలు తప్పకుండా అమలు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో రఘురాం, పంచాయతీరాజ్ డీఈ చెన్నయ్య మాజీ జెడ్పీటీసీ రవి, సర్పంచ్ సింధుజా, నాయకులు జయరాములు, ఉస్మాన్, మధుసూదన్రెడ్డి, గోవర్ధన్సాగర్, పుల్లారావు, భాస్కర్ యాదవ్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.