నెట్వర్క్ మహబూబ్నగర్, ఆగస్టు 5; ఆర్టీసీ బస్సుల రాకపోకలకు కొన్ని గంటలు బ్రేక్ పడింది. సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించి.. అందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెడితే గవర్నర్ తమిళిసై మోకాలడ్డుతుండడంతో కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 9 డిపోల వద్ద శనివారం తెల్లవా రుజాము నుంచి బస్సులను బయటకు తీయ లేదు. దాదాపు 3 గంటలపాటు డిపోలకే పరి మితం కాగా.. ఉదయం 8 గంటల తర్వాత ఉద్యోగులు విధుల్లో చేరారు. కార్మికుల కల నెరవేరే బిల్లును గవర్నర్ ఆమోదించకపోవడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. ఏండ్లుగా ఎదు రుచూస్తున్న తమ ఆశను నీరుగార్చేలా వ్యవహరిం చడం సరికాదని కోరారు. ప్రతి బిల్లునూ రాజకీయ కోణంలో చూడొద్దని వారు సూచించారు.