కొల్లాపూర్, డిసెంబర్ 6 : మండలంలోని సింగవట్నం ఆలయానికి మహర్దశ పట్టనున్నది. రాష్ట్రంలో యాదాద్రి ఆలయం తర్వాత సింగవట్నం లక్ష్మీనరసింహస్వామి ఆలయం రెండోదిగా ప్రాచూర్యం లో ఉన్నది. సురభి రాజుల కాలం నాటి నుంచి చారిత్రాత్మక, ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఎస్డీఎఫ్ నిధుల నుంచి రూ.15 కో ట్లను ప్రణాళిక శాఖ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు జారీ చేశారు. నిధు లు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్కు కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఆలయ ఆధునీకరణ పనులకు సంబంధించిన ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి ఎమ్మెల్యే అందజేశారు. దీంతో నిధులు మంజూరయ్యాయి. ఆలయాభివృద్ధికి రూ.5.76 కోట్లు, వసతుల కోసం రూ.3.30 కోట్లు, భక్తుల కోసం రూ.84 లక్షలు, నీటి సరఫరాకు రూ.85 లక్షలు, శానిటేషన్ కోసం రూ.76 లక్షలు, భూసేకరణ కోసం రూ.349 లక్షలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధులతో ఆలయ రూపురేఖలు మారనున్నాయని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేవాలయం సమీపంలో ఉన్న శ్రీవారి సముద్రం, హరితహోటల్, కాటేజీలు, రత్నగిరి కొండ, పచ్చని పంటలు పర్యాటకులను ఎంతగానే ఆకర్షిస్తున్నాయి.
ఎమ్మెల్యే చొరవతో ఆలయ అభివృద్ధి..
ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి చొరవతో సింగవట్నం లక్ష్మీనర్సింహస్వామి ఆలయం అభివృద్ధికి సీఎం కేసీఆర్ రూ.15 కోట్లు మంజూరు చేయడం సంతోషంగా ఉన్నది. ఈ నిధులతో ఆలయ రూపురేఖలు మారనున్నాయి. ఆలయానికి ఆదాయం కూడా పెరగనున్నది. నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్ కుటుంబానికి స్వామి వారి కృప ఎల్లప్పుడూ ఉంటుంది.