దామరగిద్ద, ఫిబ్రవరి 25 : దేశం స్వచ్ఛంగా మారాలంటే మరుగుదొడ్ల పాత్ర ముఖ్యం. గతంలో ఇంట్లో మరు గుదొడ్లు లేక బహిర్భూమికి వెళ్లి కాలకృత్యాలు తీర్చుకునేవారు. తద్వారా మహిళలు అత్యంత ఇబ్బందులకు గురయ్యేవారు. దీంతోపాటు అంటురోగాలు ప్ర బలే అవకాశం ఎక్కువగా ఉండేది. క్రమం గా ప్రభుత్వాలు వాటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, ప్రతి ఇంటికీ మరుగుదొడ్లు అవసరమ ని గ్రామస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులను అప్రమత్తం చేసింది. ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించారు. ఇంటి ఎదుట ఉన్న త క్కువ స్థలంలో దానిని ఏర్పాటు చేసుకొని వినియోగించుకోవాలని సూచించారు. ఈ క్రమంలో మహిళలకు చాలా అనుకూలంగా మారడంతో పాటు, నీటి కాలుష్యం, గాలి కాలుష్యం కాకుండా వాటితో వచ్చే అంటు వ్యాధులను రాకుండా ఉండేందుకు ఆస్కారం ఏర్పడింది.
ఇంటింటికీ తిరిగి అవగాహన
గ్రామాల్లో అధికారులతోపాటు ప్రజాప్రతినిధులు, స ర్పంచులు, ఎంపీటీసీలు ఇంటింటికీ తిరుగుతూ అవగాహన కల్పించాం. అందు కు చాలా మంది మరుగుదొడ్లను నిర్మించుకొని చేసుకో వాలి. కొందరు నిర్మించుకున్న తర్వాత బిల్లు రాకుండా వినియోగిస్తే బిల్లు రావని వాడడం లేదు. కొందరు మరుగుదొడ్లను కట్టెలు పెట్టుకోవడానికి, ఇతర పనులకు వినియోగిస్తున్నారు. మనం ఎంత అవగాహన కల్పించిన ప్రజలు మారనంత వరకు 100శాతం పూర్తి చేయలేం.
– బక్క నర్సప్ప ఎంపీపీ
విడుతల వారీగా మంజూరు
మండలంలోని 30 గ్రామాలకు గానూ మొదటి విడుతలో 7,377మందికి మరుగుదొడ్లు మంజూరు చేశాం. మిగతా వారికి గానూ రెండో విడుతలో 321మంది మంజూరు చేశాం. ఇంకా ఎవరు కూడా మిగలకూడదని 164మందికి మంజూరు చేశారు. అందులో 80శాతం మంది మరుగుదొడ్లను నిర్మించుకొని వినియోగిస్తున్నారు. ఇంకా 2 శాతం లబ్ధిదారులకు బిల్లులు రావాల్సి ఉంది.
– శశికళ ఎంపీడీవో